నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయని నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ ఎ.వై.రెడ్డి చెప్పారు. గుంటూరులోని ఓ హోటల్లో శుక్రవారం ఏపీ, తెలంగాణ, యానాం, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోని నవోదయ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, విద్యాశాఖాధికారులతో ప్రవేశాల ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు. ఎ.వై.రెడ్డి మాట్లాడుతూ నూతన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన జరగనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల పరిశీలన క్షుణ్ణంగా జరిపి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. గతేడాది ప్లస్ టూ ఫలితాల్లో 99.44 శాతం ఉత్తీర్ణత నమోదుచేసి హైదరాబాద్ రీజియన్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. సమావేశంలో నవోదయ నేతృత్వ సంస్థ డెరైక్టర్ జంధ్యాల వెంకటరమణ, అసిస్టెంట్ కమిషనర్లు జి.అనసూయ, వి.జె.జగదీశ్వరాచారి పాల్గొన్నారు.
‘నవోదయ’లో ప్రవేశాలకు నూతన మార్గదర్శకాలు
Published Fri, Sep 2 2016 8:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement