Sakshi News home page

నూతన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం

Published Sun, Aug 7 2016 10:45 PM

లడ్డూ కౌంటర్‌ను ప్రారంభిస్తున్న డెప్యుటీ ఈవో చిన్నంగారి రమణ

తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభమైంది.  ఆలయ డెప్యుటీ ఈవో చిన్నంగారి రమణ ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల భక్తుల రద్దీ పెరగడంతో ఆలయంలోని లడ్డూ కౌంటర్‌ను వెలుపలికి తరలించాలని టీటీడీ ఈవో, జేఈవోలు ఆదేశించినట్లు తెలిపారు.  దీంతో ఓ భక్తుడు అందించిన  రూ.80లక్షల విరాళంతో వాహనమండపం వెనుక నూతన భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు.  ఈ భవనంలో కింది భాగం లడ్డూ కౌంటర్లు, మొదటి అంతస్తులో పరకామణి గదిని ఏర్పాటుచేశామన్నారు. ఇకపై భక్తులకు బార్‌కోడింగ్‌తో కూడిన లడ్డూ టోకెన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పేష్కార్‌  రాధాకృష్ణ, సూపరింటెండెంట్‌ రవి, ఏఈ శివయ్య  పాల్గొన్నారు.

Advertisement
Advertisement