రాజమహేంద్రవరం గ్యాంగ్రేప్ నిందితులపై నిర్భయ | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరం గ్యాంగ్రేప్ నిందితులపై నిర్భయ

Published Sun, Apr 24 2016 10:56 AM

nirbhaya case against gangrape culprits in rajamahendravaram

రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువతిపై గ్యాంగ్రేప్ ఘటనలో అరెస్ట్ అయిన నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఆదివారం రాజమండ్రిలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందుకు హాజరుపరిచారు. నిందుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు కిరణ్కుమార్తోపాటు సతీష్ కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. అలాగే నిర్భయతోపాటు 341, 376- సి, 365, 323, 506  సెక్షన్ల కింద కూడా నిందితులపై కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ దామోదర్ వివరించారు.

Advertisement
Advertisement