చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ లేఖ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ టీడీపీ నాయకులు తరచుగా సభలు, సమావేశాల్లో ప్రకటిస్తున్నారని, అరుుతే ఇలాంటి కొంగజపాలు మాని ఎన్నికల హామీలను అమల్లో పెట్టాలని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. హామీల అమలు గురించి అడిగిన వారిపై దాడులు చేయించడాన్ని తప్పుపట్టారు. ‘ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? లేక ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎమర్జెన్సీ విధించారా?’ అని ప్రశ్నిస్తూ సీఎంకు రాసిన లేఖ ప్రతులను శనివారం మీడియాకు విడుదల చేశారు. ‘ఈ రాష్ట్రంలో కాపులు మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏ ఊరిలో చూసినా మీ ముఖంతో ఉన్న ఫ్లెక్సీలే ఉండాలా? మీ ఫ్లెక్సీలపై మా జాతి దాడి చేయడానికి సంస్కారం అడ్డువస్తోంది.
మీరు పాదయాత్రలో, 2014 ఎన్నికల సమయంలో బలిజ, ఒంటరి, తెలగ, కాపు జాతి ఓట్ల కోసం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని, సంవత్సరానికి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీలు ఇచ్చారు. వాటి గురించి అడుతుంటే దాడులు చేయిస్తున్నారు. మీరిచ్చిన హామీల గురించి రోడ్డుపైకి వచ్చి అడగకూడదా? పట్టిసీమకు, పప్పుబెల్లాలకు, రాజధాని వంకతో యువరాజా వారి పట్టాభిషేకం కోసం, మీరు విదేశాల్లో తిరగడానికి కోట్ల ప్రజాధనాన్ని అడ్డూ అదుపు లేకుండా ఖర్చు చేయట్లేదా? కాపు జాతికి ఇచ్చిన హామీల అమలుకు మాత్రం బిచ్చం వేసినట్లుగా రూ.50 కోట్లు, రూ.100 కోట్లు ఇచ్చి సరిపెడతారా?
ఎందుకు మా జాతిని చులకనగా చూస్తున్నారు? మీరు గద్దె ఎక్కడానికి మాత్రం మా జాతి ఓట్లు కావాలా? మీరిచ్చిన హామీలే అమలు చేయమంటే అబద్ధాలతో ఎదురుదాడి చేయించడం సమంజసమా? మా మీద దాడి చేయిస్తే తోక ముడిచి పారిపోతామనుకుంటున్నారేమో! బంతిని ఎంతగట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుంది. మా జాతి తిరగబడటానికి భయపడదు. మీ తీరు మార్చుకోండి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు. కాకమ్మ కబుర్లు మాని కార్యాచరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం...’ అని లేఖలో పేర్కొన్నారు.
కాపులకు స్వేచ్ఛ లేదా?
Published Sun, Dec 13 2015 5:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement