కర్నూలు(టౌన్): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే కోట్ల సర్కిల్లో కోట్ల విజయభాస్కర్రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక కిసాన్ఘాట్లో కోట్ల 97వ జయంతి వేడుకలను పురస్కరించుకుని భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. రైతుల కోసం ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మాణంలో విశేషంగా కషి చేశారని కొనియాడారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ మాట తప్పారన్నారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే మదన్గోపాల్, మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయి
Published Tue, Aug 16 2016 11:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement