భారీ బందోబస్తుతో పాత నోట్ల తరలింపు | Sakshi
Sakshi News home page

భారీ బందోబస్తుతో పాత నోట్ల తరలింపు

Published Wed, Nov 23 2016 11:19 PM

భారీ బందోబస్తుతో పాత నోట్ల తరలింపు - Sakshi

హిందూపురం అర్బన్‌ : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను బుధవారం సాయంత్రం భారీ పోలీసు బందోబస్తుతో తరలింపు చేపట్టారు. స్థానిక ఎస్బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద లారీ కంటైనర్‌లో బాక్సుల్లో నింపిన పాతనోట్లు రూ.వంద కోట్లు తరలించినట్టు అక్కడ చెప్పుకోసాగారు. సీఐ స్థాయి పోలీసుల పర్యవేక్షణలో ప్రత్యేక ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది సాయుధ బందోబస్తుతో కరెన్సీ తరలింపులు చేపట్టారు. 15 రోజులుగా పట్టణంలోని అన్ని బ్యాంకుల ద్వారా సేకరించిన పాత నోట్లను ప్యాకింగ్‌ చేసి తరలింపులు చేపట్టారు.

Advertisement
Advertisement