రేషన్‌ బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Published Sat, Oct 8 2016 10:57 PM

రేషన్‌ బియ్యం పట్టివేత

మోత్కూరు : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని మోత్కూరు మండల కేంద్రంలో శనివారం పట్టుకున్నట్లు ఎస్సై కె.రవికుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపెల్లి మండలం దెయ్యంబండతండాకు చెందిన యువకులు నవీన్, జయేందర్‌ టాటాఏస్‌లో 10 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ బియ్యాన్ని పనకబండ గ్రామంతో పాటు మోత్కూరు పట్టణంలోని అన్నెపువాడలో లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి కోనుగోలు చేశారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement