మైదుకూరు టౌన్:
కడప –కర్నూలు కాలువకు నీరు అందించడంల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పుష్పాల శ్రీనాధరెడ్డి విమర్శించారు. కాలువలు సరిగ్గా లేవని నీరు రావడం లేదనే సాకుతో జిల్లా రైతాంగం పట్ల చిన్న చూపు చూడడం తగదన్నారు. జిల్లాలో వేల ఎకరాలు నీరులేక బీళ్లు బారిపోయిందన్నారు. అధికారులు మాత్రం ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. కేసీ కాలువకు నీరందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బీ.పీ వెంకట ప్రతాప్రెడ్డి, బీసీ గుర్రప్ప, శ్రీధర్బాబు, డి. రఘునాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీకి నీరివ్వడంలో అధికారుల నిర్లక్ష్యం
Published Wed, Jul 20 2016 6:53 PM
Related news
-
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
నీరమ్మా... నీరు
ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి. ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది. తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు. ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్ రాసిన ‘పానీ’ కథ ఇది. కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా? ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది. నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు! -
ఈ ఆనంద్ మంచి ‘సరస్సు’ లాంటి వాడు.. ఇంట్రస్టింగ్ స్టోరీ
సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఇటీవల నీటి కొరత సంక్షోభానికి దారితీసింది. లేక్ సిటీగా పేరొందిన బెంగళూరులోజనం గుక్కెడు నీటికోసం అల్లాడిన పరిస్థితి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంలో చెరువుల పునరుద్ధరణ మిషన్కోసం అహరహం శ్రమిస్తున్న బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజనీర్ ‘లేక్ మ్యాన్’ స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుందాం రండి! కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎన్నో మంచి నీటి చెరువులతో కళకళలాడుతూ ఉండేది. కానీ కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్న పరిస్థితిల్లో చెరువులన్నీ చాలా వరకు ఎండిపోయాయి. కొన్ని పూర్తిగాకనుమరుగయ్యే స్థితికి చేరాడు. దీనికితోడు తక్కువ వర్షపాతం మరింత ప్రభావితం చేసింది. ఇక్కడే మెకానికల్ ఇంజనీర్ ఆనంద్ మల్లిగవాడ్ హృదయం తప్పించిపోయింది. బాల్యంలో ఇంటికి సమీపంలోని చెరువు, దాని అందాలను ఆస్వాదించిన మల్లిగవాడ్కు చెరువుల దుస్థితి చూసి చలించిపోయాడు. ఇక అప్పటినుంచి బెంగళూరు నగర దుస్థితిని తలుచుకుని నీటి వనరుల సంరక్షణకు ఆనంద్ మల్లిగవాడ్ చెరువులను కాపాడటంలో ఒక యజ్ఞమే చేస్తున్నాడు. 36ఎకరాల ఎండిపోయిన సరస్సును కేవలం 45 రోజుల్లోనే పునరుద్ధరించి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. చెరువుల పునరుద్ధరించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచి పెట్టేశాడు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షకుడిగా మారిన ఆనంద్, ఇప్పటివరకు 7 సరస్సులను పునరుద్ధరించాడు. అంతేకాదు 2025 నాటికి నగరంలోని 45 చెరువులకు తిరిగి జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1960లలో బెంగళూరులో దాదాపు 290 సరస్సులు ఉండేవి. 2017 నాటికి 90కి పడిపోయింది. తొలి ప్రాజెక్టుగా ఎండిపోయిన కైలాసనహళ్లి సరస్సును నీటితో నింపాలని నిర్ణయించుకున్నాడు. అందరూ చూసి నవ్వారు.. అందరూ పిచ్చి వాడన్నారు అయినా తన ప్రయాణం అపలేదు. ఈ ప్రయాణాన్ని ఒంటరిగానే ప్రారంభించాడు. అంతేకాదు ఇవాల్టి తాగు నీటి కష్టాలకు కారణం సరస్సులు, చెరువులు మాయం కావడం కూడా ఒక కారణమని అంటాడు. అందుకే భవిష్యత్తరాలకు చెరువులను ఎలా పునరుద్ధరించాలి అనే దానిపై అవగాహన కల్పించాలని అసవరం ఉందంటాడు. View this post on Instagram A post shared by Wyzr (@wyzr.in) ఒకప్పుడు బెంగళూరులో దాదాపు రెండువేల చెరువులు, ఐదొందలకు చేరడంతో వీటిరక్షణకు బిగించాడు.చెరువులను సంరక్షించుకునే క్రమంలో అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేశాడు. నగరంలోని 180 పురాతనమైన చెరువులను పరిశీలించాడు ఆనంద్. ఎట్టకేలకు తాను పనిచేస్తున్న కంపెనీ సన్సేరా ఇంజనీరింగ్ కంపెనీని ఒప్పించి లక్ష డాలర్లు సహాయంగా పొందాడు. వీటితో బొమ్మసంద్రలోని 36 ఎకరాల కైలాసనహళ్లి చెరువుకు 2017లో మళ్లీ జీవం పోశాడు. స్థానికులు, కూలీల సహాయంతో, అతను సరస్సు ఎండిపోయిన బెడ్ నుండి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలిగాడు. ఆ మట్టిని ఉపయోగించి సరస్సులో చిన్న చిన్న దీవులను తయారు చేశాడు. ఇపుడీ ఈ ద్వీపాలు ఇప్పుడు వేలాది పక్షులు, చెట్లతో అలరారుతున్నాయి. అలాగే 2018లో రెండెకరాల వాబసంద్రా, 2019లో 16 ఎకరాల కోనసంద్ర లేక్ను పునరుద్ధరించాడు. ఫార్మ, గ్రానైట్ కంపెనీల వ్యర్థాలతో నిండి వున్నచెరువును 65 రోజుల్లో 80 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దాడు. మల్లిగవాడ సరస్సు పునరుద్ధరణ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్లు మద్దతిచ్చారు. తిరుపాళ్య సరస్సు పునరుజ్జీవన ప్రాజెక్ట్ 180 రోజులలో పూర్తి చేశారు. పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువు 30 సంవత్సరాల తర్వాత మంచినీటితో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దీని నిల్వ చేసే సామర్థ్యాన్ని 3 రెట్లు పెరగడం విశేషం. ముఖ్యంగా ఈ చెరువుల పునరుద్ధరణ కోసం చెరువులో పూడిక, కలుపు, మట్టిని, చెత్తను ప్లాస్టిక్ వ్యర్థాలను త్రవ్వి తీసి కట్టలను బలోపేతం చేస్తాడు. తరువాత సరస్సు చుట్టూ బాగా మొక్కలు నాటిస్తారు. తద్వారా వలస పక్షుల కోసం ద్వీపాలను కూడా సృష్టించాడు. వర్షాకాలం తర్వాత ఆరు నెలల్లోనే సరస్సులను స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. అలాగే విరాళాల ద్వారా చెరువుల రక్షణకు పూనుకున్నాడు. 3. 5 ఎకరాల్లో ఉన్న గవిని రక్షించారు. ఇప్పటివరకు 80 చెరువులకు మళ్లీ జీవం పోశాడు.దాదాపు ఎనిమిదేళ్లలో మల్లిగవాడ్ బెంగళూరులో మరో 35 సరస్సులను, అలాగే అయోధ్యలో ఏడు, లక్నోలో తొమ్మిది , ఒడిశాలో 40 చెరువును బాగు చేయడం విశేషం. దీంతో దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ,కార్పొరేట్ కంపెనీల సాయంతో ఈ ప్రయాణం ఇలా సాగుతోంది. 2026లో 900 ఎకరాల హెన్నాగర సరస్సును బాగు చేయాలనేది లక్ష్యం. తద్వారా చుట్టుపక్కల రైతులకు లాభం చేకూరాలని, భూగర్భ జలాలను కాపాడాలనేది ప్రయత్నం. ఆనంద్ మల్లిగవాడ్ సందేశం ‘‘సహజ వనరులను గౌరవించడం నేర్చుకుందాం. ప్రకృతిని ప్రేమించుదాం. ప్రకృతి అందించిన వనరులను మనకు అవసరమై నంత మాత్రమే వాడుకుందాం. నీటిని సంరక్షింకుందాం. జీవితంలో సగం మన కోసం జీవిద్దాం. మిగిలి జీవితాన్ని పరిరక్షణ కోసం వెచ్చించుదాం. మన భవిష్యత్తరాలకు కోసం ఇదే ఉన్నతమైన దృక్పథం. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
పైపైనే గంగ.. లేదు బెంగ
మెదక్జోన్: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం శమ్నాపూర్కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్ బిగించి పైపులైన్ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. 24 గంటలు మోటార్ నడిచినా.. ఐదు గజాల బావిలో మోటార్ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్ నడిచినా నీరు తగ్గడం లేదు. ఏ కాలంలోనైనా నిండుగా.. ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్ ఉన్నంత సేపు మోటార్ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్ బంద్ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్
Related News by category
-
‘ఆప్’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతీకి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఆసుపత్రి ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్ధారణ కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తున్నట్లు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర పాండే శనివారం స్పష్టం చేశారు. రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమ్నాథ్ భారతీకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. 2016 సెప్టెంబర్ 9న సోమ్నాథ్ భారతీ మరో 300 మందితో కలిసి ఎయిమ్స్ ప్రహరీ గోడపై ఉన్న ఫెన్సింగ్ను ధ్వంసం చేసినట్లు కేసు నమోదయ్యింది. అంతేకాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో 2014లో అర్ధరాత్రి సమయంలో ఓ ఆఫ్రికా మహిళపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. -
కరోనా వ్యాక్సిన్ ‘రెడీ టూ యూజ్’ : రష్యా మంత్రి
మాస్కో: కరోనా వైరస్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వేగంగా కదులుతున్న రష్యా మరో కీలక విషయాన్ని ప్రకటించింది. తమ దేశానికి చెందిన కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ వాడకానికి వచ్చే నెలలోనే సిద్ధంగా ఉంటుందని ఉప రక్షణ మంత్రి రుస్లాన్ సాలికోవ్ ప్రకటించారు. మాస్కోకు చెందిన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాలికోవ్ ఈ విషయం చెప్పారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. తమ వ్యాక్సిన్కు సంబంధించిన మొదటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశామని సాలికోవ్ తెలిపారు. ముఖ్యంగా రెండవ దశ పరీక్షలు విచారణ సోమవారం ముగిసాయనీ, వీరందరూ కరోనావైరస్ నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నారని, త్వరితంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను వేలాదిమందిపై త్వరలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఎపుడు మొదలుపెట్టేదీ, టీకా ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన స్పష్టంగా ప్రస్తావించలేదు. మరోవైపు సాలికోవ్ చేసిన వాదనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. కాగా మాస్కోలోని ప్రభుత్వ సంస్థ గమలేయ ఇన్స్స్టిట్యూట్ అండ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో కరోనావైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్టు రష్యన్ ఆర్మీ ఇటీవల ప్రకటించింది. రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వేలాది మంది వాలంటీర్లతో దశ-3 మానవ క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయనీ, టీకా పంపిణీ సెప్టెంబరు నాటికి ప్రారంభమవుతుందని (ఆర్డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రోవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిమిత్రోవ్ ప్రకారం, దేశీయంగా 30 మిలియన్ మోతాదులను, అంతర్జాతీయంగా170 మిలియన్లను తయారు చేయనుంది. వ్యాక్సిన్ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపాయి. -
శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరిదేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాదిలానే తెలంగాణా నుంచి అమ్మ వారికి బోనాలను సమర్పించేందుకు ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం ఇంద్రకీలాద్రికి విచ్చేయనుంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మ వారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్త బృందాలు అమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే ఉత్సవాలు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తాయి. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటలకు అమ్మ వారి దర్శనాన్ని నిలిపివేస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు అమ్మ వారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాలను, మూలవిరాట్లకు కాయగూరలు, పండ్లు, డ్రైప్రూట్స్తో అలంకరిస్తారు. ఆలయాలను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించేందుకు అవసరమైన కూరగాయల దండలను సేవా సిబ్బంది, భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఊరేగింపుగా బోనాలు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనాలను సమర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అమ్మ వారి ఆలయానికి చేరుకుంటుంది. కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ అమ్మ వారి అలంకరణకు తొలి రోజైన ఆదివారం ఆకుకూరలను వినియోగిస్తారు. రెండో రోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడో రోజైన మంగళవారం బాదం, జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ప్రూట్స్తో అలంకరిస్తారు. అమ్మ వారి అలంకరణకు ఉపయోగించిన ఆకుకూరలు, కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడు రోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకూకూరలను దండలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తుంటారు. దేవస్థానం కదంబం ప్రసాదాన్ని అమ్మ వారి మహా ప్రసాదంగా భక్తులకు వితరణ జరుగుతుంది. దేవస్థాన ఉచిత ప్రసాదాల కౌంటర్లో కదంబం ప్రసాదాన్ని వితరణ చేస్తారు. నేడు లక్ష మంది దర్శనం ఒక వైపు శాకంబరిదేవి ఉత్సవాలు, మరో వైపున తెలంగాణా నుంచి బోనాలు, ఆదివారం, ఆషాఢ సారెను సమర్పించేందుకు తరలివచ్చే భక్త బృందాలతో ఇంద్రకీలాద్రిపై పండుగ శోభ నెలకొంది. ఒకే రోజు మూడు విశేషమైన ఉత్సవాలు జరుగుతుండటంతో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష పైబడి భక్తులు అమ్మ వారి దర్శనానికి విచ్చేసే అవకాశముందని భావిస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మ వారి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి. మరో వైపున ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా షామియానాలు, మంచినీటి సదుపాయాలను దేవస్థాన కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. -
నారాజ్ చేయొద్దు
రైతు: రాజు, ఏదులాపూర్, శివ్వంపేట మండలం 139/2 సర్వే నంబర్లో 26. 1/2 (ఇరువై ఆరున్నర గుంటల) భూమి కుమారి సులోచనపై రిజిస్ట్రేషన్ చేయించాము. కాని కొత్త పాస్బుక్లో 20.1/2(ఇరవైన్నర) గుంటల భూమి ఉన్నట్లు నమోదు చేశారు. మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే గ్రామశివారులోని ముత్తయ్య చెరువు కాలువను దాడ్వాయి అశోక్ అనే వ్యక్తి పూడ్చేశారు. ఈ విషయంపై ముత్యాలు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: పాత రికార్డుల ప్రకారం ఎంత ఉంటే అంతా సర్వే చేయిస్తాము. ముతయ్య చెరువు కాలువ పూడ్చివేత పై చర్యలు తీసుకుంటాను. సాక్షి మెదక్/మెదక్ రూరల్: సాధాబైనామాలో భూమి తగ్గింది రైతు: రెడ్డిగారి వీరమణి, యెనగండ్ల గ్రామం, కొల్చారం మండలం కొల్చారం మండలం యెనగండ్ల గ్రామశివారులో గల 62 సర్వే నంబర్లో 2.4 ఎకరాల పట్టా భూమి ఉండగా, సాధాబైనామా తర్వాత అందులో 12 గుంటల భూమి తగ్గించి మంగళి ఆగమయ్య పేరిట నమోదు చేశారు. సంబంధిత తహసీల్దార్కు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. జేసీ: మీ సమస్య గురించి సంబంధిత తహసీల్దార్తో మాట్లాడి పరిష్కరిస్తాను. ప్రభుత్వం ఇచ్చిన భూమిని కబ్జా చేశారు రైతు: నర్సయ్య, నిజాంపేట మండలం, నస్కల్ గ్రామం గ్రామ శివారులో గల 229/అ సర్వే నంబర్లో నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి ఇచ్చారు. అందులో తమకు ఇచ్చిన 1.15 ఎకరాల భూమిని ఇతరులు కబ్జా చేశారు. అధికారులను పొజిషన్ చూపించాలని కోరితే పట్టించుకోవడం లేదు. జేసీ: సర్వేయర్ను పంపించి సమస్యను పరిష్కరిస్తాము. ఐదు గుంటలు తక్కువ నమోదు చేశారు రైతు: లక్ష్మీనర్సయ్య, నిజాంపేట మండలం, కె. వెంకటాపూర్ గ్రామం గ్రామ శివారులోని 315, 316, 317 సర్వే నంబర్లలో మొత్తం 2 ఎకరాల పట్టా భూమి ఉంది. కాని కొత్త పాస్బుక్లో 5 గుంటల భూమిని తగ్గించి నమోదు చేశారు. జేసీ: సంబంధిత మండల రెవెన్యూ అధికారులకు చెప్పి న్యాబద్ధమైనదైతే సరిచేస్తాము. పాస్బుక్కులు ఇవ్వలేదు రైతు: నర్సింలు, రామాయంపేట రామాయంపేట శివారులోని 1421 సర్వే నంబర్లో గల లవాణీ పట్టా భూమికి సంబంధించి 15 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చి పాస్బుక్కులను ఇవ్వలేదు. జేసీ: ఆ భూమిలో ఏం పంటలు సాగు చేస్తున్నారు. సర్వేయర్ను పంపించి వారం రోజుల్లోగా పాస్బుక్కులను ఇప్పిస్తాము. మా భూమిని కబ్జా చేశారు రైతు: నర్సింలు, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలం గ్రామ శివారులోని 234 సర్వే నంబర్లో ఉన్న అసైన్డ్ భూమికి సంబంధించి 1977లో తాత పేరిట సర్టిఫికెట్ ఇచ్చారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లాము. ప్రస్తుతం తమ భూమిని పక్క పొలం వ్యక్తి కబ్జా చేశాడు. జేసీ: మూడేళ్లకు మించి ఆ భూమిలో పొజిషన్లో లేకుంటే ప్రభుత్వం రద్దు చేస్తుంది. భూమిని సాగు చేస్తున్న వాళ్లకే వర్తిస్తుంది. భూ సమస్యను పరిష్కరించండి రైతు: సూర్యం చౌహాన్, బిక్యాతండా, శివ్వంపేట మండలం పంచాయతీ పరిధిలో గల 315, 316 సర్వే నంబర్లో ఉన్న భూ సమస్యను పరిష్కరించి రైతులకు పాస్బుక్కులు అందించగలరు. జేసీ: భూమి ఉన్నదాని కంటే ఎక్కువ ఉండటం వల్ల ఫారెస్ట్ అధికారులు గెజిట్ పబ్లికేషన్ తీసుకొచ్చి హద్దులు వేశారు. సమస్య ఉన్నందున ఆ భూమిని పార్ట్ బీలో పెట్టడం జరిగింది. సర్వే చేయించి సమస్య పరిష్కరించి పాస్బుక్లను అందిస్తాము. లవాణీ పట్టా కొనుగోలు చేశాం రైతు: నర్సింగ్, చిన్నచింతకుంట గ్రామం, నర్సాపూర్ గ్రామ శివారులోని 918 సర్వే నంబర్లో లవాణీ పట్టాను కొనుగోలు చేశాము. పట్టా చేయడం లేదు. జేసీ: హెచ్ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి చట్ట ప్రకారం పట్టా కాదు. పాస్బుక్ ఇప్పించండి రైతు: సిద్ధయ్య, వడియారం గ్రామం, చేగుంట మండలం సర్వే నంబర్ 642లో గల 32 గుంటల ఇనాం భూమికి సంబంధించి పాస్బుక్ రాలేదు. జేసీ: ఓఆర్సీ ఇప్పించి 10 రోజుల్లో పాస్బుక్లను అందిస్తాము. ఒకే భూమిని ఇద్దరికి విక్రయించారు రైతు: వహీబ్ఖాన్, నర్సాపూర్ సర్వే నంబర్ 17/12లో గల లవాణీ పట్టా భూమిని 1989లో తీసుకున్నాము. కాని అదే భూమిని 2006లో ఇతరులకు విక్రయించారు. ఇలా ముగ్గురి పేర్లమీద ఉంది. జేసీ: ఆ భూమిని ఎవరూ కొనడానికి వీలులేదు. అందులో చేపట్టిన నిర్మాణాలను పడగొట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటాము. భూమిని మ్యూటేషన్ చేస్తలేరు రైతు: శ్రీనివాస్, రాజ్పల్లి, మెదక్ మండలం సర్వే నంబర్ 427/అ 2లో గల 13 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించాము. కాని మోటేషన్ చేయమంటే సంబంధిత వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాము. అధికారులు పట్టించుకోవడం లేదు రైతు: విభూది రాచప్ప, దొంతి గ్రామం, శివ్వంపేట మండలంతల్లి ఎల్లమ్మ పేరిట ఉన్న 8గుంటల పట్టా భూమిని పౌతి చేయమంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకుంటాను. నా భూమి వేరే వ్యక్తి పేరిట నమోదైంది రైతు: నారాయణ, శివాయిపల్లి, మెదక్ మండలం 43/ఇ2 సర్వేనంబర్లో గల 13 గుంటల బారాణ భూమిని నా పేరుతో ఉన్న మరో వ్యక్తి అయిన నారాయణ పేరిట నమోదయ్యింది. మా పేర్ల పక్కన తండ్రి పేరును గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సమస్య పరిష్కరించాలని వీఆర్వో, ఎమ్మార్వోల చుట్టూ తిరిగినా పట్టించుకోవడవం లేదు. జేసీ: వారం రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను. పాస్బుక్కులు ఇవ్వలేదు రైతు: బిక్షపతి, రాయిలాపూర్, కౌడిపల్లి మండలం 394, 387 సర్వే నంబర్లో ఉన్న రైతులకు ఎవరికి పాస్బుక్కులు రాలేవు. దీంతో రైతుబంధు, రైతుబీమా డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. జేసీ: వారం రోజుల్లో సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తాను. ఇద్దరికి చెందాల్సిన భూమిని ఒక్కరికే ఇచ్చారు రైతు: శంకరయ్య, ఎల్లుపల్లి, టేక్మాల్ మండలం 141 సర్వే నంబర్లో గల 21 గుంటల భూమి శంకరయ్య, సుధాకర్ల పేరు మీద ఉంది. కాగా సాధా బైనామాలో ఇద్దరికి చెందిన భూమిని సుధాకర్ ఒక్కిరి పేరిట రాసారు. జేసీ: ఆర్డీఓకు ఆర్ఓఆర్ అప్పీల్ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. పాస్బుక్ రాలేదు రైతు: విజయ్కుమార్, కోనాపూర్ గ్రామం, రామాయంపేట433/202 సర్వే నంబర్లో గల ఎకరం లవాణీ పట్టా భూమికి సంబంధించి పాస్బుక్ రాలేదు. జేసీ: పార్ట్ బీలో ఉన్నందు వల్ల పాస్బుక్ రాకుండవచ్చు. సర్వేచేయిస్తాను. రిజిస్ట్రేషన్ చేసినా బుక్లో నమోదు చేస్తలేరు రైతు: కుమ్మరి మల్లేషం, శెట్టిపల్లి గ్రామం, వెల్ధుర్తి మండలం గ్రామ శివారులో 38 సర్వే నంబర్లో 14 గుంటల పట్టా భూమిని కొనుగోలు చేసి 2006 రిజిస్ట్రేషన్ చేయించాము. కాని బుక్లో నమోదు చేయడం లేదు. అలాగే 289, 38 సర్వే నంబర్లలో ఉన్న భూమిలో 15 గుంటల భూమి తక్కువ వస్తుంది. సంబంధిత ఎమ్మార్వో, వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: మీసేవలో పెట్టిన దరఖాస్తు ఉందా. మీసేవలో రూ.145 చెల్లించి నమోదు చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మీసేవ రశీదును వాట్సప్కు పెట్టండి. కొన్న భూమిని కోల్పోవాల్సి వస్తుంది రైతు: రఘుపతి, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలంగ్రామ శివారులోని 260 సర్వే నంబర్లో గల 35 గుంటల పట్టా భూమిని మా తండ్రి లక్ష్మీనారాయణ పేరిట కొనుగోలు చేశాము. కాని 266 సర్వే నంబర్లో ఉందంటున్నారు. కాగా 260 సర్వే నంబర్లో గల భూమి జాతీయ రహదారి విస్తరణలో పోతుంది. సమస్యను పరిష్కరించండి. జేసీ: రికార్డు ప్రకారం సర్వే నంబర్లో ఉన్న భూమిపై హక్కు ఉంటుంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. లేకుంటే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. బీఈడీ ఎంట్రెన్స్లో నిజాంపేట వాసికి 13వ ర్యాంక్ నిజాంపేట(మెదక్): నిజాంపేట గ్రామానికి చెందిన యువకుడు బీఈడీ ఎంట్రెన్స్ పరీక్షలో సాంఘీకశాస్త్ర్రంలో 13వ ర్యాంక్ సాధించాడు. ఈ మేరకు నిజాంపేట గ్రామానికి చెందిన వోగుల సురేష్ గత నెల 31న జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా మంచి ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా 13వ ర్యాంక్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు పెద్దశంకరంపేట(మెదక్): వర్షాలు సమృద్ధిగా కురియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడిచంద్రశేఖర్శర్మ హనుమాన్ ఆలయంలో చందనోత్సవం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కేవీపీఎస్ జిల్లా కమిటీ ఎన్నిక నర్సాపూర్: కుల వివక్ష వ్యతిరేఖ పోరాట సమితి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నర్సాపూర్లో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా మహా సభల్లో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా తుకారం, నాగరాజులు ఎన్నికయ్యారు. తమతో పాటు 19 మందితో కూడిన జిల్లా కమిటీని ఎంపిక చేశారని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని వారు పేర్కొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి మనోహరబాద్(తుప్రాన్): వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృచెందారు. ఎస్ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. కూచారం గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ(35) తన ఇంటి ముందు ఉన్న ట్రాక్టర్ను పక్కకు పెట్టడానికి కింద నిలబడి స్టార్ట్ చేయగా గేర్లో ఉన్న ట్రాక్టర్ అకస్మాత్తుగా అతనిపైనుంచి వెళ్లింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీకొని.. కొనాయిపల్లి (పీటీ)గ్రామానికి చెందిన శెట్టి బాబు (28) తన బైక్పై పనినిమిత్తం రంగాయిపల్లి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీ చేసినట్లు సీడీపీఓ సోమశేఖరమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దశంకరంపేట అంగన్వాడీ టీచర్, గడిపెద్దాపూర్ తండా మినీ అంగన్వాడీ టీచర్, అల్లాదుర్గం మండలం గొల్లకుంట, రేగోడ్ మండలం కొండాపూర్, జంగంలోంక తండా, టేక్మాల్ మండలం పల్వంచ, పెద్దశంకరంపేట మండలం ఉతూలుర్ గ్రామల అంగన్వాడీ ఆయా పోస్టులు భర్తీ చేయడమైందని, పోస్టులు పొందినవారు అల్లాదుర్గం ఐసీడీఎస్ కార్యాలయంలో ఉత్తర్వులు తీసుకుని జాయినింగ్ కావాలని ఆమె తెలిపారు. పోస్టుల లిస్టు కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు. నాలుగు మండలాల్లో.. రామాయంపేట(మెదక్): స్థానిక ఐసీడీఎస్ పరిధిలోని రామాయంపేట, నార్సింగి, చేగుంట, వెల్దుర్తి మండలాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను ఎంపిక కార్యక్రమం పూర్తయిందని స్థానిక ప్రాజెక్టు సీడీపీవో స్వరూప తెలిపారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కోనాపూర్, మక్కరాజ్పేట, శంఖాపూర్, బోనాల గ్రామాల్లోని ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. మక్కరాజ్పేట, శంఖాపూర్, బోనాల, రామాయపల్లి సెంటర్లలో హెల్పర్లు, మినీ కేంద్రాలైన కోనాపూర్ పెద్ద తండా, చిన్నతండాలో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని ఆమె తెలిపారు. ఎంపికైనవారి వివరాలు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని, లిస్టు చూసుకోవాలని ఆమె సూచించారు. కాయిదంపల్లిలో పింఛన్ల పంపిణీ అల్లాదుర్గం(మెదక్): గురువారం సాక్షి దినపత్రికలో పింఛన్ పాట్లు అనే శీర్షికతో వార్త ప్రచురితం అయింది. గ్రామాల్లో పింఛన్ ఇవ్వడం లేదని, పోస్టాఫీస్లో పింఛన్లు ఇవ్వడంతో గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన పోస్టల్ సిబ్బంది శుక్రవారం కాయిదంపల్లి గ్రామానికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెల గ్రామాల్లోనే పింఛన్లు పంపిణీ చేయిస్తామని ఎంపీడీఓ విద్యాసాగర్ చెప్పారు. -
అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్
కోదాడ : చదువులో తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్న సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రీడా సమరానికి సూర్యపేట జిల్లా, కోదాడ మండలంలోని నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల ఆతిథ్యం ఇస్తోంది. గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా బుధవారం ఈ క్రీడాసమరానికి తెరలేవనుంది. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఐదో జోనల్ మేట్-2018లో అండర్-17 విభాగంలో 28 పాఠశాలల బాలికలు, అండర్-19 విభాగంలో 33 కళాశాలల 1840 మంది విద్యార్థినులు తమ సత్తా చాటనున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
- ఈసారి ఓటు మార్పు కోసమే
Advertisement