ఉప్పు దుకాణాలపై తనిఖీలు | Sakshi
Sakshi News home page

ఉప్పు దుకాణాలపై తనిఖీలు

Published Mon, Nov 14 2016 2:13 AM

officials raid salt dealers

 
నెల్లూరు(పొగతోట): ఇతర జిల్లాల్లో ఉప్పు కొరత ఉండడంతో జిల్లాలోని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఉప్పును అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు, జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఉప్పు ధరలు, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద ఉన్న ఉప్పు నిల్వలు, విక్రయాలు, ధరలు తదితర వివరాలు సేకరించాలని సివిల్‌ సప్లై అధికారులను ఆదేశించారు. కలెక్టర్, జేసీ ఆదేశాలతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు నగరంలోని ఉప్పు హోల్‌సేల్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఏఎస్‌ఓ చాల్లా లక్ష్మినారాయణరెడ్డి, సీఎస్‌డీటీలు రవి, యువరాజ్, శేఖర్‌బాబు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement