రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

Published Mon, Feb 20 2017 1:02 AM

oldman died in accident

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం రూరల్‌ మండలం ప్రజాశక్తి నగర్‌ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే నగర్‌కు చెందిన మొర్రప్ప(60) అక్కడికక్కడే మరణించగా, అతని కుమారుడు నాగరాజు గాయపడినట్లు ఎస్‌ఐ జనార్దన్‌ తెలిపారు. తండ్రీకొడుకులిద్దరూ బైక్‌లో అనంతపురం బయలుదేరగా, మార్గమధ్యంలో ఎదురొచ్చిన ఆటో ఢీకొనడంతో మొర్రప్ప అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన నాగరాజును అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
Advertisement