20న వాహనాల వేలం | Sakshi
Sakshi News home page

20న వాహనాల వేలం

Published Sat, Oct 15 2016 11:36 PM

On 20th the auction of  vehicles

ప్రొద్దుటూరు క్రైం: ఈ నెల 20న ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో వాహనాల  వేలం నిర్వహిస్తున్నట్లు ఆర్టీఓ అబ్దుల్‌రవూఫ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాక్స్‌కట్టకుండా, బకాయిలు చెల్లించకుండా పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 34 వాహనాలు ఉన్నాయని, వాటిలో లైట్‌ గూడ్స్‌ వాహనాలు 25, హెవీగూడ్స్‌ 1, మోటార్‌ క్యాబ్‌ 1, ఆటోలు 7 ఉన్నాయని చెప్పారు. వేలంలో పాల్గొనదలిచిన వారు అసిస్టెంట్‌ సెక్రటరి ఆర్టీఓ పేరు మీద రూ.5 వేలు డీడీ తీసి దరఖాస్తు ఫారంతో పాటు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలోని 9848528645 అనే ఏఓ ఫోన్‌ నెంబర్‌కు సంప్రదించాలని ఆర్టీఓ తెలిపారు.

Advertisement
Advertisement