10న మంత్రుల పర్యటన.. | Sakshi
Sakshi News home page

10న మంత్రుల పర్యటన..

Published Wed, Jun 8 2016 9:06 AM

On the arrival of the 10 ministers

భూపాలపల్లి: అభివృద్ధి పనుల శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల నిమిత్తం ఈ నెల 10న భూపాలపల్లికి పలువురు రాష్ట్ర మంత్రులు రానున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ సిరికొండ ప్రదీప్ తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


నియోజకవర్గంలో సుమారు 100 కోట్లతో చేపట్టిన, చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కార్యక్రమాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, చందూలాల్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీలు దయాకర్, సీతారాంనాయక్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, టీఆర్‌ఎస్ నాయకులు మందల రవీందర్‌రెడ్డి, తాటి వెంకన్న పాల్గొన్నారు.

Advertisement
Advertisement