రైతు సమస్యలపై ‘పోరుబాట’ | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై ‘పోరుబాట’

Published Tue, Oct 25 2016 4:25 AM

రైతు సమస్యలపై ‘పోరుబాట’

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

గజ్వేల్ రూరల్: రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సోమవారం సిద్దిపేటలో ‘రైతు పోరుబాట’ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన గజ్వేల్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో మునిగిందన్నారు.

కరువు గురించి మాట్లాడితే రాష్ట్రం పరువు పోతుందని భావించి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా చేసిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం 231 కరువు మండలాలుగా గుర్తించి రూ.791 కోట్లను మంజూరు చేసిందన్నారు. అరుుతే, ఇప్పటి వరకు ఆ డబ్బులను రైతులకు అందజేయలేదని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మంది పంటలు వేస్తే వారందరిని ఫసల్ భీమా యోజనలో భాగస్వామ్యం చేయాల్సి ఉండగా ప్రభుత్వం నాలుగైదు లక్షలకు మించి భాగస్వామ్యం చేయలేదన్నారు.  

Advertisement
Advertisement