కారు ఢీకొంటే.. ఎగిరి కారుమీద పడి మృతి | Sakshi
Sakshi News home page

కారు ఢీకొంటే.. ఎగిరి కారుమీద పడి మృతి

Published Sat, Jan 2 2016 2:12 PM

కారు ఢీకొంటే.. ఎగిరి కారుమీద పడి మృతి - Sakshi

నల్లగొండ: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ వద్ద దారుణం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం చౌటుప్పల్ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. నార్కెట్‌పల్లి శివారులోని శ్రీసాయి ఆకాంక్ష ఫిల్లింగ్ స్టేషన్ వద్ద వెంకటరెడ్డి (65) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో వెంకటరెడ్డి ఎగిరి కారుపై పడ్డారు. అయితే కారు డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో.. అదే వేగంతో కారులో దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిపోయాడు.
 
రోడ్డు పక్కన ఉన్న స్థానికులు గమనించి కారును ఆపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే వెంకటరెడ్డి మృతి చెందాడు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే వృద్ధుడు మృతిచెందాడని స్థానికులు పేర్కొంటున్నారు. విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారుతి రిట్జ్ కారు(AP 09 BY2725) హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నట్లు తెలిసింది.
 

Advertisement
Advertisement