విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి మృతి

Published Sun, Sep 18 2016 11:08 PM

బొడ్రోతు శంకరరావు(ఫైల్‌) - Sakshi

వంగర :  సంగాం గ్రామానికి చెందిన బొడ్రోతు శంకరరావు(24)అనే యువకుడు నాలుగు రోజులు కిందట విద్యుదాఘాతానికి గురై విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. శంకరరావు ఈ నెల 14న రాజాం పరిధి డోలపేటలో ఉన్న తన అక్క మజ్జి కుమారి ఇంటికి వెళ్లాడు. రెండో అంతస్తులో ఉన్న ఇంటిని ఆనుకొని 11కేవీ విద్యుత్‌లైన్‌ ప్రమాదకరంగా తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. దీంతో స్థానికంగా ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. రాజాం పోలీసులు కేసు నమోదు చేశారు. శంకరరావు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.  

Advertisement
Advertisement