స్నేహితుల మధ్య కొట్లాట.. యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

స్నేహితుల మధ్య కొట్లాట.. యువకుడి మృతి

Published Sun, Feb 5 2017 1:47 PM

one dies in friends quarrel in guntur

బాపట్ల(గుంటూరు):
ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల తులసీనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో కోపోద్రిక్తుడైన ఓ యువకుడు కోటిరెడ్డి పై దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కోటిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement