దుగ్గిరాల మండలం తుమ్మపూడి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తోన్న ఆటో, టాటా ఏస్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక రు అక్కడికక్కడే మృతిచెందగా..మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. బాధితులు చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తుమ్మపూడి వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి
Published Thu, Jul 21 2016 7:11 PM
# Tag
Related news
-
పెమ్మసాని...కాసుల కహానీ
పెమ్మసాని...కాసుల కహానీ -
‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
సాక్షి, ఆదిలాబాద్: జీవితంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ సాధిస్తే మొదట కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు.. అయితే మాజీ ఎంపీ మధుసూదన్రెడ్డికి మాత్రం ఈ సంతోషం పంచుకునేందుకు ఆ అవకాశం లేకుండా పోయింది.. ఆయన భార్య అప్పటికే విగత జీవి.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన తర్వాత కొద్ది రోజులకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తుప్రాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోగా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మార్చిలో ఈ ప్రమాదం జరగగా ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనే ఆమె అదే పరిస్థితిలో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.న్యాయవాద వృత్తి నుంచి..ఆదిలాబాద్లో టి.మధుసూదన్రెడ్డి అప్పటికే దశాబ్దాలుగా ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు. అప్పుడు 58 ఏళ్ల మధ్య వయస్సు.. భార్య భూలక్ష్మి, అప్పటికే పెళ్లిళ్లు జరిగిన కుమారుడు ప్రకాష్రెడ్డి, కూతురు సంగీత, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. 2004లో ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఖరారైంది. మార్చి 1న ఆయన ఆదిలాబాద్కు చెందిన ఓ న్యాయవాది కూతురి వివాహం హైదరాబాద్లో ఉండడంతో మధుసూదన్రెడ్డి భార్య భూలక్షి్మతో కలిసి కారులో డ్రైవర్తో సహా బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యలో మధుసూదన్రెడ్డి కారు నడుపుతుండగా భార్య ముందర కూర్చుంది.డ్రైవర్ వెనుక సీటులో ఉన్నాడు. తుప్రాన్ వద్ద అనుకోని పరిస్థితిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూలక్షి్మకి తీవ్ర గాయాలు కాగా మధుసూదన్రెడ్డికి మెడ వద్ద స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఇద్దరిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే భూలక్ష్మి కోమాలోకి వెళ్లిపోయింది. మధుసూదన్రెడ్డి చికిత్స అనంతరం తేరుకున్నారు. ఏప్రిల్ 20న 14వ లోక్సభ మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డి 4,15,429 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్చారి 3,74,455 ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ప్రముఖ న్యాయవాదిగా తన విజయాన్ని చూసిన భాగస్వామి భూలక్ష్మి ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియకుండానే కోమాలోనే 2007లో ఆమె కన్ను మూశారు.మొదటిసారి ఎన్నికల్లో..బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించింది. 2004 సాధారణ ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రంలో పోటీ చేసింది. కొత్త పార్టీగా ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనే ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ఆ ఐదుగురు ఎంపీల్లో పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలుపొందగా మెదక్ నుంచి ఆలె నరేంద్ర, హన్మకొండ నుంచి బి.వినోద్ కుమార్, వరంగల్ నుంచి దరావత్ రవీందర్ నాయక్ ఉన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఉండగా, ఆ దిశగా యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవడంతో 2006లో బీఆర్ఎస్ యూపీఏ నుంచి వైదొలిగింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మధుసూదన్రెడ్డి కూడా ఉన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మధుసూదన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆదిలాబాద్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో కృంగిపోకుండా ఆయన తిరిగి న్యాయవాది వృత్తి చేపట్టడం గమనార్హం. 2015లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. -
హైవేలపై ఆగి ఉన్న మృత్యువు
సాక్షి, హైదరాబాద్: కొందరి నిర్లక్ష్యం మరికొందరిపాలిట మృత్యుపాశమవుతోంది. అనుమతి లేకున్నా జాతీయ రహదారుల వెంట నిలిపి ఉంచుతున్న భారీ వాహనాలు ఢీకొని దుర్మరణంపాలవుతున్నారు. జాతీయ రహదారుల్లో వేగంగా దూసుకెళ్లే వాహనదారులు ముందు ఆగిన లారీలు, భారీ ట్రక్కులను గుర్తించే లోపే నష్టం జరిగిపోతోంది. ఏప్రిల్ 25న కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో కారు మొత్తం కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ తరహా ప్రమాదాలు పెరుగుతుండటం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. రోజుకో రోడ్డు ప్రమాదం.. మూడు రోజులకొకరు మృతి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నివేదికల ప్రకారం చూస్తే తెలంగాణలో ఈ తరహాలో జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న లారీలు, ట్రక్కులను ఢీకొట్టడం కారణంగా ప్రతి రోజూ కనీసం ఒక ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదాల కారణంగా ప్రతి మూడు రోజులకు ఒకరి చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018 నుంచి 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 600 మంది మృతి చెందగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 2022లో తెలంగాణలో మొత్తం 331 రోడ్డు ప్రమాదాలు ఈ తరహాలో జరగ్గా, 128 మంది మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువ ప్రమాదాలు తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 గంటల మధ్య జరగడం గమనార్హం. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆగిఉన్న లారీలను ఢీకొట్టే కార్లు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగం ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హైవేలపై పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవుజాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు నిలిపి ఉంచడం, పార్కింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం. అలా వాహనాలు నిలిపితే ఐపీసీ 304 సెక్షన్ కింద కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతీయ రహదారుల వెంట ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఈ తరహాలో వాహనాలు నిలపకుండా పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున ఆ వేళల్లో పోలీసులను మరింత అప్రమత్తం చేసేలా సర్క్యులర్ను జారీ చేస్తాం. – మహేష్ భగవత్, తెలంగాణ రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన నిర్లక్ష్యం ఇలా.. » జాతీయ రహదారుల వెంట వాహనాలు నిలిపి ఉంచవద్దని నిబంధనలు ఉన్నా.. భారీ ట్రక్కులు, లారీల డ్రైవర్లు కొందరు వీటిని విస్మరిస్తున్నారు. » ఏదైనా మరమ్మతుల కారణంగా వాహనం తప్పక ఆపాల్సి వస్తే వెనుక నుంచి వాహనదారుడికి ఆ విషయం తెలిసేలా పార్కింగ్ లైట్లు తప్పక ఆన్ చేసి పెట్టాలి. సేఫ్టీ ట్రైయాంగిల్ ఆకారాన్ని వాహనానికి కొంత దూరంలో పెట్టాలి. » జాతీయ రహదారుల వెంట ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలిపి ఉంచాలి. కానీ చాలామంది అలా చేయడం లేదు » డ్రైవర్ అలసిపోయినప్పుడు తెల్లవారుజాము సమయంలో వాహనాన్ని జాతీయ రహదారి వెంటే నిలిపి ఉంచి నిద్రిస్తుండడం సైతం మిగిలిన వాహనదారులకు మృత్యుపాశమవుతోంది. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్కుమార్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్గా పనిచేస్తూ నవీన్కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత లేని బాబు.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని విమర్శించారు. గుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు.జననేత రాకతో పొన్నూరులో పండుగ వాతావరం నెలకొంది. సీఎం నినాదాలతో ప్రచార సభ మార్మోగిపోయింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు. ఈ యుద్ధంలో ఓ వైపు కౌరవ సేన, దృష్ట చతుష్టయం ఉందని విమర్శించారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిని దుయ్యబట్టారు. ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఉన్నాయని ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవాడికీ మేలు చేసిన చరిత్రలేని వీళ్లంతా కూటమిగా చేరి ఇంటింటికీ మంచి చేసిన ఒకే ఒక్కడైన మీ జగన్తో యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ నమ్ముకున్నది మిమ్మల్ని(ప్రజలు), పైనున్న ఆ దేవుడినే అని తెలిపారు. జగన్ పొత్తు ప్రజలతోనే ఉంన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లకు ప్రజల ఇంటి అభివృద్ధిని నిర్ణయించేవన్నారు. పేదల తలరాతలను నిర్ణయించేవని చెప్పారు. వైఎస్ జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పతకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు.సీఎం జగన్ పూర్తి ప్రసంగం విశ్వసనీయత ఉన్న ఈ ప్రభుత్వం మీద విలువలు లేని చంద్రబాబు ఎలా నోరుపారేసుకుంటున్నారో వింటున్నారు కదా14 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పకుండా జగన్ను తిడుతున్నాడుచంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడుపోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హోరో బచ్చాలనే కనిపిస్తాడునువ్వు బచ్చా అంటున్న నేను ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి ధైర్యంగా పొరాడుతున్నా14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేకపోతున్నాడుచంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చే ఒక్కమంచి పథకం అయినా ఉందా?14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలకు తాను చేసిన మేలు చెప్పి ఓట్లు ఎందుకు అడగలేకపోతున్నాడు?మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేాశా అని చెప్పే చంద్రబాబు పేదవాళ్లకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా ఉందా?బచ్చా అంటున్న జగన్ను చూసి.. బాబు ఎందుకు బయపడుతున్నాడు?బచ్చాను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తు ఎందుకు?చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, పెన్షన్ వంటి పథకాలు నువ్వు ఎందుకు చేయలేదు?ఐదేళ్లలో నేను అమలు చేసిన పథకాలనే అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నావు?రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?గత మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేశాంలంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాంనాడు-నేడుతో విద్యా, వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం.31 లక్షల ఇళ్ల పట్టాలు,. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.నా కేబినెట్లో 68శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు.58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాపేదల భవిష్యత్తు మరో రెండడుగులు ముందుకు వేసేలా 2024 మేనిఫెస్టో.
Related News by category
-
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం కమిటీ నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా బీసీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా దానబోయిన వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులుగా కొడాలి క్రాంతి, రాచమంటి గంగాధర్రావు, సున్నం మల్లికార్జునరావు, దానబోయిన శివశంకరరావు, కుంచాల శ్రీనివాసరావు, డి.మంగ, కార్యదర్శులుగా కడియం నాగేశ్వరరావు, జె.నాగమోహన్, పమిడి నరసింహారావు, పి.నాగేంద్రబాబబు, బలుసుపాటి వీరేంద్రకుమార్, ఆలా మహేష్, రాచకొండ వెంకటేశ్వరరావు, కె.పరమేశ్వరరావు, గుండు నాగరాజు, సహాయ కార్యదర్శులుగా తుల్లిమెల్లి శ్రీనివాస్, కె.రామలింగేశ్వరరావు, కాకుమాను ఉమామహేశ్వరరావు, పొదిలి శ్రీనివాసరావు, ఎస్.జార్జిరాజు, బండి నాగరాజు, షేక్ మదరసా (షఫి), షేక్ జానీ, కేశన ఏడుకొండలు, కాకుమాను రవిప్రతాప్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్సీ విభాగం కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. విభాగం జిల్లా అధ్యక్షుడిగా పెరికల కృష్ణమోహన్, ఉపాధ్యక్షులుగా లింగాల మరియబాబు, బత్తుల వెంకట్రావు, కనపర్తి అనిల్, ప్రధాన కార్యదర్శులుగా డి.నరసింహారావు, జె.దాసు, మట్టిగుంట ప్రసన్నకుమార్, కొరగంటి ఉదయ్రాజు, దాసరి రత్నరాజు, సౌపాటి ప్రేమ్కుమార్, దేవరకొండ నాగేశ్వరరావు, జండ్రాజుపల్లి నాగేశ్వరరావు, ఉన్నవ ప్రశాంత, కార్యదర్శులుగా బత్తుల మరియన్న, పడాల దుర్గా, కుక్కమూడి అచ్చిబాబు, ఎం.రమేష్కుమార్, కె.బోయేజు, పిల్లి ధర్మరత్నం, మాతంగి ఆశీర్వాదం, కారుమూరి అంకమ్మరావు, గేరా సంజీవ్, టి.నరసింహారావు, ఎస్.నాగరాజు, గడ్డం మురారి, గంటా రమేష్, కె.విజయ్, సహాయ కార్యదర్శులుగా మేరిగ అమర్బాబు, మురికిపూడి రమేష్, దారం సాంబశివరావు, ఎం.బాలయ్య, చెరుకూరి నాగయ్య, శాంతకుమారి, రాయపూడి చినరాజు, కట్టెపోగు ఉదయభాస్కర్, వడ్డేశ్వరం రవి, కట్టవరపు ఆషాజ్యోతి, మాతంగి రవీంద్ర, కాకాని రవీంద్రబాబు, ఎం.సతీష్, మంచాల బిక్షాలు, గేరా చిన అంకయ్య, బుర్రి కిషోర్, నల్లపాటి బేబి, వై.ఇమ్మానియేల్ రాజు, దావులూరి పోతురాజు, గొరికపూడి జోసఫ్లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షురాలిగా వెంకటరమణి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి వెంకటరమణిని పార్టీ వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈమేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. -
అట్టహాసంగా మేకతోటి సుచరిత నామినేషన్
తాడికొండ: తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత నామినేషన్ ఘట్టం కొనసాగింది. గుంటూరు నవభారత్నగర్ 4వ లైను నుంచి ప్రారంభమైన ర్యాలీ తాడికొండ చేరడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. నవభారత్ నగర్, విద్యానగర్, సాయిబాబా రోడ్డు, కొరిటెపాడు మీదుగా లాడ్జి సెంటర్ వద్దకు చేరుకొని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామా బిల్డింగ్, నగరాలు, గోరంట్ల, లాం సెంటర్కు చేరుకొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాం గ్రామస్తులు క్రేన్తో సుచరితకు భారీ గజమాలను వేసి సత్కరించారు. అనంతరం వాహనాల ర్యాలీ నడుమ తాడికొండ అడ్డరోడ్డుకు చేరుకోగా అక్కడ మేడికొండూరు మండలానికి చెందిన కొరివి అజయ్ ఏర్పాటు చేసిన భారీ గజమాలతో స్వాగతం పలకగా కార్యకర్తలు నాయకులు కదం తొక్కారు. అడ్డరోడ్డు కూడలి జనసంద్రంగా మారింది. డీజే బాక్సులు, పూల జల్లులతో అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుమారుడు మేకతోటి హర్షిత్, కుమార్తె మేకతోటి రిషికతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొన్న మేకతోటి సుచరిత నామినేషన్ పత్రాలు ఆర్వో ఎం గంగరాజుకు అందజేశారు. నామినేషన్ ఘట్టానికి స్వచ్ఛందంగా 25 వేల మందికి పైగా హాజరయ్యారు. మండుటెండను లెక్క చేయకుండా నామినేషన్ కార్యక్రమానికి మహిళలు, యువకులు, పార్టీ నాయకులు, కార్యాకర్తలు భారీగా హాజరయ్యారు. రహదారులు జై జగన్, జై సుచరిత నినాదాలతో దద్దరిల్లిపోయింది. అనంతరం ఎంపీ కిలారి వెంకట రోశయ్యతో కలిసి తాడికొండ షిర్డిసాయి పర్తి సాయిబాబా ఆలయంలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్వయంగా రంగంలోకి దిగి తాడికొండ అడ్డరోడ్డులో వాహనాలను ముందుకు నడిపించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యతో కలసి ఆర్వోకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న మేకతోటి సుచరిత గుంటూరు నుంచి జన ప్రవాహం అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి హాజరు కుమారుడు, కుమార్తెతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సుచరిత -
పదిలో మెరిసిన బాలికలు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. నాలుగేళ్లతో పోల్చితే ప్రస్తుత ఏడాది జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రైవేటు, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు, అత్యధిక ఉత్తీర్ణత నమోదు కావడం గొప్ప విషయం. గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరైన 27,178 మంది విద్యార్థుల్లో 23,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 14,223 మంది పరీక్షలు రాయగా, వారిలో 12,297 మంది ఉత్తీర్ణులై 86.46 శాతంగా నమోదైంది. బాలికలు 12,955 మంది పరీక్షలు రాయగా, వారిలో 11,658 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.99 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. వీరిలో 19,689 మంది ప్రథమ శ్రేణి, 3,031 మంది ద్వితీయ శ్రేణి, 1,235 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులున్నారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత టెన్త్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, జిల్లాలో 88.14 శాతంగా నమోదైంది. రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లా 16వ స్థానంలో నిలిచింది. గతేడాది 77.40 శాతం ఉత్తీర్ణతతో ఆరో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుత ఫలితాల్లో దిగజారింది. 2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్ కారణంగా ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. తరువాత జరిగిన రెండేళ్ల ఫలితాలతో పోల్చితే రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానం దిగజారినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం ఆహ్వానించదగిన పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించిన విధానం, ట్యాబ్లు, ఐఎఫ్పీల ద్వారా ప్రవేశపెట్టిన ఆధునిక విద్యాబోధన, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉద్యోగోన్నతులతో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన అంశాల ప్రభావం పదో తరగతి పరీక్షల్లో స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభావంతులుగా నిలిచారు. ప్రైవేటు, కార్పొరేట్తో పోటీ పడి రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించడంతోపాటు జిల్లాలో టాపర్లుగా నిలిచారు. స్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే టెన్త్ ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు జెడ్పీ హైస్కూల్కు చెందిన తమలపాకుల అభినవ్ 600 మార్కులకు అత్యధికంగా 584 మార్కులను కై వసం చేసుకుని జిల్లా టాపర్గా నిలిచాడు. గుంటూరు రూరల్ యనమదల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు షేక్ రిహానా 583, షేక్ సమ్రీన్ 582, బాలనాగు మధుమిత 578 మార్కులు సాధించారు. గుంటూరు నగర పరిధిలో ఇజ్రాయిల్పేటలోని బొర్రా నాగేశ్వరరావు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ ఫాతిమా తబసుమ్ 582 మార్కులతో నగర స్థాయిలో టాపర్గా నిలిచింది. వీరితోపాటు 550కు మార్కులు సాధించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.టెన్త్ ఫలితాల్లో 582 మార్కులు కమ్మలూరి సాత్విక(జెడ్పీ హైస్కూల్, చినకాకాని, మంగళగిరి మండలం), సయ్యద్ మొహమ్మద్ (బీఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్, మంగళగిరి), కాసుల ఈశ్వరి(జెడ్పీ హైస్కూల్, శేకూరు, చేబ్రోలు మండలం), గంజి హర్షవర్ధన్ (ఎస్ఆర్ఎస్ మున్సిపల్ హైస్కూల్, తెనాలి), శృంగవరపు దీపిక(జెడ్పీ హైస్కూల్, గోగులమూడి, పెదనందిపాడు) సాధించారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత నమోదు రాష్ట్రస్థాయిలో జిల్లాకు 16వ స్థానం స్థానం దిగజారినా పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు అధిక మార్కులు సాధించిన పేదింటి ప్రతిభా కుసుమాలు -
రేపు బలసాని కిరణ్కుమార్ నామినేషన్
గుంటూరురూరల్: మరోసారి జగనన్నే ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను అందజేసేందుకు బయలుదేరనున్నానని తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీగా బయలుదేరి ఏటుకూరు మీదుగా ప్రత్తిపాడులోని తహసీల్దారు కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నిమినేషన్ కార్యక్రమంలో పాల్గొని తనను ఆశీర్వదించాలని కోరారు. నేడు పేరంటాళ్లమ్మ కల్యాణం, తిరునాళ్లు వల్లభాపురం(కొల్లిపర): మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలోగల సర్విరెడ్డి పేరంటాలమ్మ దేవస్థానంలో మంగళవారం ఉద యం కల్యాణం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం శిడిమాను ఉత్సవం, తిరునాళ్ల ఉంటాయని పేర్కొన్నారు. భక్తులంతా అమ్మవారిని సందర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోవాలని సభ్యులు కోరారు. ఏలూరి కో–ఆపరేటివ్ బ్యాంక్ శాఖ ప్రారంభం తెనాలి: ఏలూరి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 5వ శాఖ సోమవారం సాయంత్రం తెనాలిలో ప్రారంభమైంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని దేవీచౌక్లో శాఖను కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ, తెనాలి చైర్మన్ డి.ఎల్. కాంతారావు ప్రారంభించారు. స్ట్రాంగ్ రూంను పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం ప్రారంభించగా, లాకర్లను నటరాజ్ జ్యూయలరీ అధినేత కొత్తమాసు కుమార్, బ్యాంక్ డైరెక్టర్ దత్త వెంకట కిరణ్ ప్రారంభించారు. 1999లో తమ బ్యాంక్ను ప్రారంభించినట్టు చైర్మన్ ఏలూరి గురవయ్య చెప్పారు. డైరెక్టర్లు వనమా నరేంద్రకుమార్, టి.శ్రీహరిరావు, సీఈవో కోట శ్రీనివాస్, చీఫ్ మేనేజరు ఎం.వి.ఆర్ శేషుకుమార్, రవిమోహన్ పాల్గొన్నారు. ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 98.45 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యంలోని పాఠశాలల్లో అత్యధికంగా 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. కొరిటెపాడులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన 3287 మంది విద్యార్థుల్లో 3236 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 15 బాలుర పాఠశాలలతో పాటు 14 బాలికల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కలకడలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పి.లిఖిత అత్యధికంగా 597 మార్కులు సాధించినట్లు తెలిపారు. 11వ అదనపు జిల్లా జడ్జిగా శ్రీనివాస్ తెనాలిరూరల్: తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ స్వాగతం పలికారు. న్యాయమూర్తికి ఇటీవల కొత్తగా ఎన్నికై న బార్ అసోసియేషన్ కమిటీని పరిచయం చేశారు. -
ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్
గుంటూరువెస్ట్: గుంటూరు పార్లమెంట్ స్థానానికి సోమవారం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డికి టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ పెమ్మసాని, రవిశంకర్ పెమ్మసాని నామినేషన్ పత్రాలు అందజేశారు. వీరితోపాటు బొమ్మసాని ముత్యాలరావు (ఆల్ పీపుల్స్ పార్టీ), షేక్ ఖాజావలి (ఇండిపెండెంట్), మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ చిష్టి పాషా (ఏపీ రాష్ట్ర సమితి) విష్ణురెడ్డి(బెంగళూరు నవ నిర్మాణ పార్టీ)లు నామినేషన్లు దాఖలు చేశారు. క్షమాపణలు చెప్పిన పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనచోదకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే వాహనచోదకులకు కలిగిన అసౌకర్యానికి పెమ్మసాని విలేకరుల ముందు క్షమాపణలు కోరారు. పోలీసులపై దురుసు ప్రవర్తన పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా కలెక్టరేట్లోకి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలీసులు ఆయనతోపాటు మరో నలుగురిని పంపారు. వెనుకనే మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాళ్లు నరేంద్ర, తెనాలి శ్రావణ్కుమార్లు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని సున్నితంగా అడ్డుకుని నచ్చజెప్పబోయారు. వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. మరో రెండు నెలలపాటే మీ ఆటలంటూ కోపంతో ఊగిపోయారు. అయితే పోలీసులు మాత్రం సంయమనం పాటించారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
Advertisement