తుమ్మపూడి వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

తుమ్మపూడి వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి

Published Thu, Jul 21 2016 7:11 PM

One killed in road accident

దుగ్గిరాల మండలం తుమ్మపూడి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తోన్న ఆటో, టాటా ఏస్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక రు అక్కడికక్కడే మృతిచెందగా..మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. బాధితులు చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement