ఆగి ఉన్న లారీ ఢీ కొన్న జీపు: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీ ఢీ కొన్న జీపు: ఒకరి మృతి

Published Sat, Aug 22 2015 10:09 AM

One killed in road accident in ysr district

మైదుకూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని జీపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కడప, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement