వీరవాసరం/మొగల్తూరు : స్నేహితులతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడు ఆదివారం గల్లంతయ్యాడు. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన దూది రామలింగేశ్వరరావు వీరవాసరం డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్కు వెళ్లాడు. బీచ్లో తోటి స్నేహితులతో కలిసి సముద్రంలో స్నానానికి దిగారు. కొద్దిసేపు ఉల్లాసంగా గడిపిన తర్వాత ఒడ్డుకు రాగా రామలింగేశ్వరరావు కనిపించకపోవడంతో స్నేహితులు కంగారుపడ్డారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి పరిసర ప్రాంతాల్లో వెతికారు. మధ్యాహ్న సమయంలో ఇంటి దగ్గర భోజనం చేసి మోటార్ బైక్పై పేరుపాలెం బీచ్కు వెళ్లాడని రాయకుదురు గ్రామానికి చెందిన అతని మిత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమతో గడిపిన స్నేహితుడు సముద్రంలో గల్లంతయ్యాడన్న వార్తతో రాయకుదురులో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామం నుంచి యువకులు, కుటుంబ సభ్యులు పేరుపాలెం బీచ్కు బయల్దేరా రు. రామలింగేశ్వరరావుకు తల్లిదండ్రులు అన్నపూర్ణ, రాంబాబు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు.
బీచ్లో యువకునికి గాయాలు
మొగల్తూరు: మోటార్ సైకిల్పై తీరం వెంబడి ప్రయాణిస్తూ ప్రమాదానికి గురికావడంతో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వీరవాసరానికి చెందిన కర్రా నాని స్నేహితలతో కలిసి బీచ్కు వచ్చాడు. మోటార్ సైకిల్పై తీరం వెంబడి ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో నాని కంటికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని108 వాహనంలో నరసాపురం ఆస్పత్రికి తరలించారు.