రెండు గంటల్లో ముగియనున్న స్వాతంత్య్ర దినోత్సవం
అవార్డుల ప్రదానోత్సవ కారక్రమం వాయిదా
శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నామమాత్రం
జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా పతాకావిష్కరణ
పాల్గొననున్న కలెక్టర్, ఎస్పీ.. పుష్కర ఇన్చార్జిలకు మినహాయింపు
నల్లగొండ: కృష్ణా పుష్కరాల ప్రభావం స్వాతంత్య్ర దినోత్సవంపై పడింది. ప్రతి ఏడాది ఆగస్టు 15న ఘనంగా నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలను పుష్కరాల కారణంగా కుదించారు. జిల్లా సమస్త యంత్రాంగం పుష్కరాల్లో నిమగ్నం కావడంతో స్వాతంత్య్ర దినవేడుకలను రెండు గంటల్లో ముగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రతి ఏడాది విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు, జిల్లా అధికారులకు అందజేసే ప్రశంస పత్రాలు, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ సారి వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా 80 ప్రభుత్వ శాఖలకు చెందిన 420 మంది ఉద్యోగులను ఉత్తమ అవార్డు గ్రహీత లుగా ఎంపిక చేశారు. అయితే వారంతా ప్రస్తుతం కృష్ణా పుష్కరాల్లో విధుల్లో పాల్గొనడం తో అవార్డుల ప్రదానోత్సవాన్ని మరొక రోజు పెట్టుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. మంత్రి జగదీశ్రెడ్డి అనుమతితో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించే రోజును త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. దీంతో సోమవారం జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో కేవలం ఆస్తుల పంపిణీ వరకే పరిమితం కానుంది. అది కూడా ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీ, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేసేందుకు 30 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. డీఆర్డీఏ, డ్వామా, అటవీ శాఖ, పరిశ్రమల శాఖ ఇలా నాలుగైదు శాఖలకు చెందిన శకటాలను మాత్రమే ప్రదర్శిస్తారు. సాంస్కృతి కార్యక్రమాలు కూడా పరిమితం చేశారు. మొత్తంగా సోమవారం జరిగే స్వాతంత్య్ర వేడుకలను రెండు గంటల్లో ముగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల్లోగా వేడుకలు ముగిస్తారు
షెడ్యూల్
ప్రతి ఏడాది ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలను ఈసారి పది గంటలకు మార్చారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.
10.10 గంటలకు మంత్రి ప్రజనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలోనే ఎంపిక చేసిన అవార్డు గ్రహీతల వివరాలను మంత్రి ప్రకటిస్తారు. 10.40 గంటలకు పుర ప్రముఖల పరి^è యం. 11.15 గంటలకు వివిధ అభివృద్ధి, సంక్షేమ శాఖల ద్వారా ఆస్తుల పంపిణీ
12 గంటలకు జాతీయ గీతాలాపన.
ఆస్తుల పంపిణీ వరకే...
Published Mon, Aug 15 2016 1:34 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement