Sakshi News home page

ఓపెన్‌ స్కూల్స్‌కు గడువు పెంపు

Published Fri, Sep 16 2016 8:24 PM

OPEN SCHOOLS ENTRANCE

అమలాపురం టౌన్‌ :
పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 30 వరకూ గడువు పెంచినట్లు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూలు) జిల్లా కో ఆర్డినేటర్‌ జనార్దనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని సెంటర్ల కో ఆర్డినేటర్లు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు అమలాపురం రవీంద్ర మహర్షి విద్యాసంస్థల అధినేత గిడుగు నాగేశ్వరరావును సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రవేశాల కోసం 9640335777, 9347357755 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని జనార్దనరావు సూచించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement