పద్మనాయక వెలమ సంఘం జిల్లా కార్యవర్గం | Sakshi
Sakshi News home page

పద్మనాయక వెలమ సంఘం జిల్లా కార్యవర్గం

Published Sun, Aug 28 2016 11:28 PM

padmanayaka district cameeti

కరీంనగర్‌ : కరీంనగర్‌ పద్మనాయక వెలమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, కార్యదర్శిగా బోయినపల్లి ప్రవీణ్‌రావు ఎన్నికయ్యారు. కాసుగంటి లక్ష్మణ్‌రావు జువ్వాడి రంగారావుపై 734 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాసుగంటికి 1379, సమీప అభ్యర్థులు రంగారావుకు 645 ఓట్లు, రేగులపాటి పాపారావుకు 303 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా బోయినపల్లి ప్రవీణ్‌రావు 201 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రవీణ్‌రావుకు 1279 ఓట్లు లభించగా సమీప అభ్యర్థి బల్మూరి ప్రసాద్‌రావుకు 1079 ఓట్లు వచ్చాయి. విజేతలకు ఎన్నికల అధికారులు మ«ధుసూదన్‌రావు, వెంకటేశ్వర్‌రావు, వేణుగోపాలరావు, కేవీ వేణుగోపాల్‌రావు ధ్రువీకరణపత్రాలు అందజేశారు. కాసుగంటి లక్ష్మణ్‌రావు గతంలో రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నూతన కార్యవర్గాన్ని మాజీ అధ్యక్షుడు కఠారి దేవేందర్‌రావు అభినందించారు.
 
 

Advertisement
Advertisement