అనంతపురం సెంట్రల్ : ‘మహిళా పోలీస్స్టేషన్లో పద్ధతి ఏం బాగలేదు. ఇక్కడ పని చేస్తున్న కొంతమంది స్టేషన్ బయటే పంచాయితీలు చేసి పంపిస్తున్నారు. పద్ధతి మార్చుకోండి’ అంటూ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్బాను మండిపడ్డారు. సోమవారం నగరంలోని మహిళా పోలీస్స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల గురించి ఆరా తీశారు. బాధితులు పోలీస్స్టేషన్కు వస్తే సమస్యను చెప్పుకునే వాతావరణం కల్పించాలని సూచించారు. కనీసం స్టేషన్లో రిసెప్షనిస్టు లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, స్టేషన్ బయట పంచాయితీలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు. మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీవీయాక్టు కౌన్సిలర్ ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.