చిరుత దాడి : 4 మేకలు మృతి | Sakshi
Sakshi News home page

చిరుత దాడి : 4 మేకలు మృతి

Published Fri, Aug 5 2016 11:48 PM

మేక కళేబరం వద్ద బాధితుడు సజ్జు

కోయిల్‌కొండ : చిరుత దాడి చేయడంతో నాలుగు మేకలు మృత్యువాతపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. కోయిల్‌కొండకు చెందిన అబ్దుల్‌ సజ్జుకు నాలుగు మేకలు ఉన్నాయి. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం అవి సమీపంలోని ఖిల్లా కోటకు మేత కోసం వెళ్లాయి. అనంతరం చిరుత దాడి చే యడంతో చనిపోయాయని చుట్టుపక్కల ఉన్న గొర్రెలకాపారులు తెలిపారు. ఈ విషయం అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా సంఘటన స్థలాన్ని డిప్యూటీ రేంజర్లు కృష్ణయ్య, బాలకిష్టయ్య  పరిశీలించారు. ఈ ప్రాంతంలో రెండు చిరుతలు కనిపించాయని గొర్రెల కాపరులు అధికారులకు వివరించారు. 
 

Advertisement
Advertisement