అభివృద్ధి కోసమే పార్టీ మారాం | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కోసమే పార్టీ మారాం

Published Thu, Jul 21 2016 12:13 AM

party change for the development

సంగెం : తమను నమ్ముకున్న క్యాడర్, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని పాలకుర్తి, పరకాల ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్గూర్‌స్టేçÙన్‌ మాజీ సర్పంచ్‌ జీజుల సమ్మయ్య తల్లి లక్ష్మి, కొత్తగూడెం సర్పంచ్‌ వాసం సాంబయ్య తండ్రి వాసం వీరస్వామి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.
 
బుధవారం ఇద ్దరు ఎమ్మెల్యేలు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.  అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్‌ సారథ్యం లో నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేల వెంట సర్పంచ్‌లు రంగరాజు నర్సింహస్వామి, మాదినేని రాంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కిషన్‌నాయక్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు,  సుదర్శన్‌రెడ్డి, నరహరి, ఉండీల రాజు, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement