పార్టీ బలోపేతానికి కృషి చేయాలి | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

Published Mon, Jan 9 2017 3:21 AM

party must work to strengthen

నాంపల్లి : సీపీఎం బలోపేతనికి ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కోరారు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జరనల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని గ్రామగ్రామానా విస్తృత పరిచి ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. మండలంలోని లక్ష్మినర్సింహస్వామి ప్రాజెక్ట్‌ కింద భూములను నష్టపోయిన లక్ష్మణాపురం, టి.పిగౌరారంతోపాటు ఇతర గ్రామాలకు చెందిన భూనిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మండలంలో ప్రతి సమస్యపై సీపీఎం ఎప్పటికప్పుడు స్పందించి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపట్టాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి సభ్వత్వాలు పూర్తిస్థాయిలో చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం, సీఐటీయూ మండల అధ్యక్షుడు కామాళ్ల యాదగిరి, కసిపాక ముత్తిలింగం, గడ్డం గురుమూర్తి, జంపాల ఈదయ్య తదితరులున్నారు.
 

Advertisement
Advertisement