పాలన, ప్రజలను గాలికొదిలి అమరావతి జపం
వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
గడపగడపకూ వైఎస్సార్లో పెద్దిరెడ్డి ఆగ్రహం
చౌడేపల్లె(పుంగనూరు): అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనే ధ్యేయంగా చంద్రబాబు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ జెడ్పీ వైస్చైర్మన్ పెద్దిరెడ్డిలతో కలిసి చౌడేపల్లెలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఒరిగిందేమీ లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై ఉన్న శ్రద్ధ పాలనపైనా, ప్రజలపైనా లేదన్నారు.
అక్రమ సంపాదనతో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తన పార్టీలోకి ఎలా కొనుగోలు చేయాలన్న ధ్యాస తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో లాలూచిపడిన సంగతి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. హామీలు అమలు చేయకుండా ఆర్థిక లోటు ఉందని చెబుతూ అమరావతి పేరుతో విదేశీ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు ముక్తకంఠంతో హోదా కోసం నినదిస్తే, ఆయన మాత్రం ప్యాకేజీ కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎçప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు అందరూ సుఖ సంతోషాలతో గడుపుదామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అక్రమ సంపాదనే చంద్రబాబు ధ్యేయం
Published Mon, Feb 20 2017 10:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement