చంద్రబాబు అరాచక రాజకీయాలపై మండిపాటు
ఏపీ వ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ’ ప్రదర్శనలు కొవ్వొత్తులతో విపక్ష శ్రేణుల ర్యాలీలు
♦ ఎమ్మెల్యేలను కొనే డబ్బు ఎక్కడిదంటూ నిలదీత
♦ టీడీపీ కుటిల రాజకీయంపై వెల్లువెత్తిన ఆగ్రహం
♦ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపాటు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవినీతి, అరాచక రాజకీయాలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతృత్వంలో రణభేరీ మోగింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి ‘సేవ్ డెమోక్రసీ’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటిల రాజకీయాలపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బెక్కడినుంచి వచ్చింది బాబూ అంటూ నిలదీశారు. స్పష్టమైన మెజార్టీ ఉండగా రూ. 20 కోట్లకు పైగా వెచ్చించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి బాబు అవినీతి సొమ్ముకు, ఎంగిలి మెతుకులకు ఆశపడి పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ‘సైకిల్’ ఎక్కుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఒకప్పుడు ఆరోపించిన చంద్రబాబు.. ఇప్పుడు అదేపనిని నిస్సిగ్గుగా చేస్తున్నారని దుయ్యబట్టారు. గుంటూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. బాబు దమననీతిని ఎండగట్టారు. కాకినాడలో జరిగిన ర్యాలీలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. తునిలో తాను రాజీనామా చేస్తానని, ఏ మంత్రినైనా సరే తనపై పోటీ చేసి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని బొత్స సత్యనారాయణ విశాఖలో డిమాండ్ చేశారు.
జన గర్జన
Published Sun, Apr 24 2016 2:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్లు... అయితే ఏంటి?
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రైతు రుణమాఫీ ఊసేది..?
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్
ప్రారంభమైన హోం ఓటింగ్
No Headline
No Headline
కూలీల కనీస వేతనం పెంచాలి
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement