Sakshi News home page

జిల్లాలో శాశ్వత మిలటరీ ఆసుపత్రి

Published Sun, Dec 4 2016 11:06 PM

perminent military hospital in district

అనంతపురం సెంట్రల్‌ : జిల్లా కేంద్రంలో మిలటరీ ఆసుపత్రికి స్థలం, నిర్మాణం కోసం నిధుల మంజూరు విషయంపై చర్యలు తీసుకుంటున్నట్లు లెఫ్టినెంట్‌ జనరల్‌ వైవీకే మోహన్‌ తెలిపారు. జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు రామసుబ్బయ్య కుమారుడు వైవీకే మోహన్‌ ఇటీవల లెఫ్టినెంట్‌ జనరల్‌గా పదోన్నతి పొందారు. జిల్లాకు వచ్చిన ఆయనను వారి నివాసంలో మాజీ సైనికులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మాజీ సైనికులకు ఆయన పలు సూచనలు చేశారు.

మిలటరీ ఆసుపత్రి కార్డులు మార్పు చేసుకుని లబ్ధి పొందాలని కోరారు. నగరంలో సవీరా ఆసుపత్రి రెఫరల్‌ ఆసుపత్రిగా అర్హత సాధించినట్లు వివరించారు. కావున మాజీ సైనికులు ఆసుపత్రికార్డులను జిల్లాకు మార్పు చేసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప, మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు షేకన్న, ఉపాధ్యక్షుడు ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement