వాగులోపడి వ్యక్తి గల్లంతు | Sakshi
Sakshi News home page

వాగులోపడి వ్యక్తి గల్లంతు

Published Wed, Jul 15 2015 5:17 PM

person missed in peddavagu river in adilabad district

కాగజ్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అండవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన నాయికిని శ్రీనివాస్ ఇసుక లోడింగ్ కోసం పెద్ద వాగు వద్దకు వచ్చాడు. బుధవారం సాయంత్రం ట్రాక్టర్‌లో ఇసుక నింపడం అయ్యాక కాళ్లు కడుక్కునేందుకు చెరువులో దిగాడు. నీటి లోతు గమనించకపోవడంతో అందులో పడి గల్లంతయ్యాడు.

Advertisement
Advertisement