అరండల్పేట: శస్త్రచికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకోవడంలో ఫిజియోథెరపీ కీలకపాత్ర పోషిస్తుందని రమేష్ హాస్పిటల్స్ ప్రముఖ ఆర్ధోపెడిక్ శస్త్రవైద్యనిపుణులు డాక్టర్ రావి పవన్కుమార్ అన్నారు. గురువారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్బంగా సిమ్స్ ఫిజియోథెరపీ కళాశాల విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ రావి పవన్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నచిన్న నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదన్నారు. చాలా సమస్యలకు ఫిజియోథెరపిలో ఉపశమనం ఉందన్నారు. ఫిజియోథెరపీపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిమ్స్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బి.శివశిరీష, డైరెక్టర్ భీమనాధం భరత్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసులు, మేనేజర్ రాంబాబు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
Related news
-
షాడో నిఘా! లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా.. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎత్తులు.. దానికి ప్రత్యర్థుల పైఎత్తులు మామూలే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థులు ఈ ఎత్తులు, పైఎత్తుల విషయంలో తిప్పలు పడుతున్నారు. ఓ వైపు తమ ప్రచారం కొనసాగిస్తూనే.. ప్రత్యర్థుల వ్యూహాలేమిటో తెలుసుకునేందుకు నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగా కొందరు ఏకంగా ‘కోవర్ట్ ఆపరేషన్లు’ కూడా చేయిస్తున్నట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఎత్తులు తెలిస్తేనే పైఎత్తులు.. అసెంబ్లీ ఎన్నికలు జరిగాక ఆరు నెలల్లోపే లోక్సభ ఎన్నికలు రావడం ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రతి అభ్యర్థి కూడా.. ఎదుటి పార్టీలో, పోటీలో ఉన్న అభ్యర్థులు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడంపై దృష్టిపెట్టారు. వారు ఎవరిని ఎలా కలుస్తున్నారు? ఏ హామీలిస్తున్నారు? ప్రలోభాల ఘట్టం ప్రారంభించారా? డంప్లు ఎక్కడ ఏర్పాటు చేశారు? వంటి అంశాలు తెలుసుకుని తిప్పికొట్టాలని.. ఓటర్లు వారి వైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుచరులకు ‘ప్రత్యేక’బాధ్యతలు ప్రత్యర్థులపై నిఘాకు, వ్యూహాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు కొందరు నమ్మకస్తులైన అనుచరులను ప్రత్యేకంగా రంగంలోకి దింపుతున్నారు. వారు తమ అభ్యర్థి తరఫున పనిచేసినా, చేయకున్నా.. ఎదుటి అభ్యర్థి ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడమే పని. వారు మరికొందరిని సమీకరించుకుని ‘షాడో టీమ్స్’మాదిరిగా పనిచేస్తూ.. ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, వారి వ్యూహాలేమిటన్నది తెలుసుకుని.. అభ్యర్థులకు సమాచారమిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే మరో అడుగు ముందుకేసి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలనూ ఆశ్రయిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు భారీగానే ఖర్చుపెడుతున్నారట. డంప్ల డేటా ‘లీక్’చేసేందుకు.. ప్రతి అభ్యర్థి తన ప్రత్యర్థులను వీలైనన్ని ఎక్కువ కోణాల్లో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం ప్రచార వ్యూహాలు మాత్రమేకాదు.. వారి ప్రలోభాల ‘డంప్స్’ల సమాచారం సేకరించడంపై దృష్టి పెడుతున్నారు. మద్యం, నగదును ఎక్కడ దాచి ఉంచుతున్నారు? ఆ కోణంలో వీరికి సహకరిస్తున్నది ఎవరు? అనే అంశాలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. పోలీసులకు, ఎన్నికల సంఘానికి వాటి సమాచారం ఇప్పించడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీయాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తమ్మీద లోక్సభ ఎన్నికల ‘సిత్రాలు’ఎన్నో.. కోవర్టు ఆపరేషన్లకూ ప్లాన్! అభ్యర్థులు తాము ఎవరితో నిఘా పెట్టినదీ ప్రత్యర్థి పార్టీవారు గుర్తించకుండా ఉండాలి, లేకుంటే బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువు. పూర్తిగా కొత్తవారిని రంగంలోకి దింపితే వారికి స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండే అవకాశం తక్కువ. దీంతో కొందరు అభ్యర్థులు.. కోవర్ట్ ఆపరేషన్లు ప్రారంభించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యర్థుల వెంట ఉండేవారికి ఎర వేసి, వారి నుంచే సమాచార సేకరణ చేస్తున్నట్టు చెప్తున్నాయి. ఇలా కోవర్ట్ ఆపరేషన్లకు సహకరించే వారికి భారీగానే నజరానాలు ఇస్తున్నట్టు వివరిస్తున్నాయి. -
బాధపడకమ్మా.. నేనున్నా: సీఎం జగన్
బత్తలపల్లి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి, ఆమె కుమారుడు అనుదీప్కుమార్రెడ్డి కలిశారు. చదువులో రాణిస్తున్న తన కుమారుడు అనుదీప్కు ఉన్నట్టుండి కంటిచూపు పోయిందని ముఖ్యమంత్రికి నాగలక్ష్మి తెలియజేసింది. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న అనుదీప్ యూట్యూబ్లో పాఠాలు వింటూ.. తోటి విద్యార్థి సహకారంతో పరీక్షలు రాస్తున్నాడని తెలిపింది. తన కుమారుడికి కంటి చూపు వచ్చేందుకు తగిన సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. అర్జీ స్వీకరించిన సీఎం జగన్ స్పందిస్తూ.. బాధపడకమ్మా.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. కాగా, అర్జీ ఇచ్చిన అరగంటలోనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి నాగలక్ష్మికి ఫోన్ వచ్చింది. అనుదీప్ ఆరోగ్య పరిస్థితి, కంటి ఆపరేషన్కు అయ్యే ఖర్చు, ఆస్పత్రి తదితర వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. -
రైలులో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు!
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ-హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని పాట్నా-డీడీయూ రైల్వే సెక్షన్లో మంగళవారం అర్థరాత్రి దానాపూర్-లోకమాన్య తిలక్ టెర్మినస్ హోలీ స్పెషల్ రైలులో మంటలు చెలరేగాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భోజ్పూర్ జిల్లా పరిధిలోని బిహియా- కరిసాత్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హోలీ ప్రత్యేక రైలులోని ఏసీ బోగీలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయాందోళనకు గురై ప్రాణాలను కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు దూకేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యూపీ రైల్వే లైన్లోని ఓహెచ్ఈలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గంలో నడిపారు. నేటి (బుధవారం) ఉదయం ట్రాక్ను క్లియర్ చేసిన తర్వాత, నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్, పాట్నా ఎల్టిటి ఎక్స్ప్రెస్ వంటి కొన్ని రైళ్లను వాటి షెడ్యూల్ మార్గం గుండా రాకపోకలకు అనుమతించారు. ఈ హోలీ స్పెషన్ రైలులో అగ్నిప్రమాదానికి గురైన కోచ్ను తొలగించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. -
అటల్ టన్నెల్లో చిక్కుకున్న పర్యాటకులు.. కాపాడిన రెస్క్యూ టీమ్!
హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్తంగ్లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హిమాచల్తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు. రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్లలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
మావోయిస్టులపై కేంద్రం ఫోకస్.. దద్దరిల్లిన దండకారణ్యం!
సాక్షి, రాయ్పూర్: మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ పతాకస్థాయికి చేరింది. ఈ క్రమంలో బలగాల కూంబింగ్లో ఛత్తీస్గఢ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉలికిపాటు మొదలైంది. వివరాల ప్రకారం.. మావోయిస్ట్ ఏరివేత కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ తీవ్రతరం చేసింది. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్ కొనసాగుతోంది. నారాయణపూర్లో కేంద్ర బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పీఎల్జీఏ స్థావరం అబూజ్మడ్ను చుట్టుముట్టేందుకు బీఎస్ఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్కు చెందిన పదివేల మందితో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, ఇటీవలే జోసెఫ్ (దర్శన్ పాల్), సంజీత్ (అర్జున్ ప్రసాద్ సింగ్)ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల మూలంగా భారత్ కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి సహకారంతో అబూజ్మడ్ను ముట్టడించే కార్యక్రమానికి కేంద్ర భద్రతా వర్గాలు రెడీ అయ్యాయి. ఇక, తాజాగా కూంబింగ్తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని తూర్పు డివిజన్ ఉలిక్కిపడింది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Related News by category
-
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం కమిటీ నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా బీసీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా దానబోయిన వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులుగా కొడాలి క్రాంతి, రాచమంటి గంగాధర్రావు, సున్నం మల్లికార్జునరావు, దానబోయిన శివశంకరరావు, కుంచాల శ్రీనివాసరావు, డి.మంగ, కార్యదర్శులుగా కడియం నాగేశ్వరరావు, జె.నాగమోహన్, పమిడి నరసింహారావు, పి.నాగేంద్రబాబబు, బలుసుపాటి వీరేంద్రకుమార్, ఆలా మహేష్, రాచకొండ వెంకటేశ్వరరావు, కె.పరమేశ్వరరావు, గుండు నాగరాజు, సహాయ కార్యదర్శులుగా తుల్లిమెల్లి శ్రీనివాస్, కె.రామలింగేశ్వరరావు, కాకుమాను ఉమామహేశ్వరరావు, పొదిలి శ్రీనివాసరావు, ఎస్.జార్జిరాజు, బండి నాగరాజు, షేక్ మదరసా (షఫి), షేక్ జానీ, కేశన ఏడుకొండలు, కాకుమాను రవిప్రతాప్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్సీ విభాగం కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. విభాగం జిల్లా అధ్యక్షుడిగా పెరికల కృష్ణమోహన్, ఉపాధ్యక్షులుగా లింగాల మరియబాబు, బత్తుల వెంకట్రావు, కనపర్తి అనిల్, ప్రధాన కార్యదర్శులుగా డి.నరసింహారావు, జె.దాసు, మట్టిగుంట ప్రసన్నకుమార్, కొరగంటి ఉదయ్రాజు, దాసరి రత్నరాజు, సౌపాటి ప్రేమ్కుమార్, దేవరకొండ నాగేశ్వరరావు, జండ్రాజుపల్లి నాగేశ్వరరావు, ఉన్నవ ప్రశాంత, కార్యదర్శులుగా బత్తుల మరియన్న, పడాల దుర్గా, కుక్కమూడి అచ్చిబాబు, ఎం.రమేష్కుమార్, కె.బోయేజు, పిల్లి ధర్మరత్నం, మాతంగి ఆశీర్వాదం, కారుమూరి అంకమ్మరావు, గేరా సంజీవ్, టి.నరసింహారావు, ఎస్.నాగరాజు, గడ్డం మురారి, గంటా రమేష్, కె.విజయ్, సహాయ కార్యదర్శులుగా మేరిగ అమర్బాబు, మురికిపూడి రమేష్, దారం సాంబశివరావు, ఎం.బాలయ్య, చెరుకూరి నాగయ్య, శాంతకుమారి, రాయపూడి చినరాజు, కట్టెపోగు ఉదయభాస్కర్, వడ్డేశ్వరం రవి, కట్టవరపు ఆషాజ్యోతి, మాతంగి రవీంద్ర, కాకాని రవీంద్రబాబు, ఎం.సతీష్, మంచాల బిక్షాలు, గేరా చిన అంకయ్య, బుర్రి కిషోర్, నల్లపాటి బేబి, వై.ఇమ్మానియేల్ రాజు, దావులూరి పోతురాజు, గొరికపూడి జోసఫ్లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షురాలిగా వెంకటరమణి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి వెంకటరమణిని పార్టీ వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈమేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. -
అట్టహాసంగా మేకతోటి సుచరిత నామినేషన్
తాడికొండ: తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత నామినేషన్ ఘట్టం కొనసాగింది. గుంటూరు నవభారత్నగర్ 4వ లైను నుంచి ప్రారంభమైన ర్యాలీ తాడికొండ చేరడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. నవభారత్ నగర్, విద్యానగర్, సాయిబాబా రోడ్డు, కొరిటెపాడు మీదుగా లాడ్జి సెంటర్ వద్దకు చేరుకొని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామా బిల్డింగ్, నగరాలు, గోరంట్ల, లాం సెంటర్కు చేరుకొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాం గ్రామస్తులు క్రేన్తో సుచరితకు భారీ గజమాలను వేసి సత్కరించారు. అనంతరం వాహనాల ర్యాలీ నడుమ తాడికొండ అడ్డరోడ్డుకు చేరుకోగా అక్కడ మేడికొండూరు మండలానికి చెందిన కొరివి అజయ్ ఏర్పాటు చేసిన భారీ గజమాలతో స్వాగతం పలకగా కార్యకర్తలు నాయకులు కదం తొక్కారు. అడ్డరోడ్డు కూడలి జనసంద్రంగా మారింది. డీజే బాక్సులు, పూల జల్లులతో అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుమారుడు మేకతోటి హర్షిత్, కుమార్తె మేకతోటి రిషికతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొన్న మేకతోటి సుచరిత నామినేషన్ పత్రాలు ఆర్వో ఎం గంగరాజుకు అందజేశారు. నామినేషన్ ఘట్టానికి స్వచ్ఛందంగా 25 వేల మందికి పైగా హాజరయ్యారు. మండుటెండను లెక్క చేయకుండా నామినేషన్ కార్యక్రమానికి మహిళలు, యువకులు, పార్టీ నాయకులు, కార్యాకర్తలు భారీగా హాజరయ్యారు. రహదారులు జై జగన్, జై సుచరిత నినాదాలతో దద్దరిల్లిపోయింది. అనంతరం ఎంపీ కిలారి వెంకట రోశయ్యతో కలిసి తాడికొండ షిర్డిసాయి పర్తి సాయిబాబా ఆలయంలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్వయంగా రంగంలోకి దిగి తాడికొండ అడ్డరోడ్డులో వాహనాలను ముందుకు నడిపించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యతో కలసి ఆర్వోకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న మేకతోటి సుచరిత గుంటూరు నుంచి జన ప్రవాహం అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి హాజరు కుమారుడు, కుమార్తెతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సుచరిత -
పదిలో మెరిసిన బాలికలు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. నాలుగేళ్లతో పోల్చితే ప్రస్తుత ఏడాది జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రైవేటు, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు, అత్యధిక ఉత్తీర్ణత నమోదు కావడం గొప్ప విషయం. గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరైన 27,178 మంది విద్యార్థుల్లో 23,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 14,223 మంది పరీక్షలు రాయగా, వారిలో 12,297 మంది ఉత్తీర్ణులై 86.46 శాతంగా నమోదైంది. బాలికలు 12,955 మంది పరీక్షలు రాయగా, వారిలో 11,658 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.99 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. వీరిలో 19,689 మంది ప్రథమ శ్రేణి, 3,031 మంది ద్వితీయ శ్రేణి, 1,235 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులున్నారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత టెన్త్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, జిల్లాలో 88.14 శాతంగా నమోదైంది. రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లా 16వ స్థానంలో నిలిచింది. గతేడాది 77.40 శాతం ఉత్తీర్ణతతో ఆరో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుత ఫలితాల్లో దిగజారింది. 2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్ కారణంగా ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. తరువాత జరిగిన రెండేళ్ల ఫలితాలతో పోల్చితే రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానం దిగజారినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం ఆహ్వానించదగిన పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించిన విధానం, ట్యాబ్లు, ఐఎఫ్పీల ద్వారా ప్రవేశపెట్టిన ఆధునిక విద్యాబోధన, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉద్యోగోన్నతులతో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన అంశాల ప్రభావం పదో తరగతి పరీక్షల్లో స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభావంతులుగా నిలిచారు. ప్రైవేటు, కార్పొరేట్తో పోటీ పడి రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించడంతోపాటు జిల్లాలో టాపర్లుగా నిలిచారు. స్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే టెన్త్ ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు జెడ్పీ హైస్కూల్కు చెందిన తమలపాకుల అభినవ్ 600 మార్కులకు అత్యధికంగా 584 మార్కులను కై వసం చేసుకుని జిల్లా టాపర్గా నిలిచాడు. గుంటూరు రూరల్ యనమదల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు షేక్ రిహానా 583, షేక్ సమ్రీన్ 582, బాలనాగు మధుమిత 578 మార్కులు సాధించారు. గుంటూరు నగర పరిధిలో ఇజ్రాయిల్పేటలోని బొర్రా నాగేశ్వరరావు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ ఫాతిమా తబసుమ్ 582 మార్కులతో నగర స్థాయిలో టాపర్గా నిలిచింది. వీరితోపాటు 550కు మార్కులు సాధించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.టెన్త్ ఫలితాల్లో 582 మార్కులు కమ్మలూరి సాత్విక(జెడ్పీ హైస్కూల్, చినకాకాని, మంగళగిరి మండలం), సయ్యద్ మొహమ్మద్ (బీఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్, మంగళగిరి), కాసుల ఈశ్వరి(జెడ్పీ హైస్కూల్, శేకూరు, చేబ్రోలు మండలం), గంజి హర్షవర్ధన్ (ఎస్ఆర్ఎస్ మున్సిపల్ హైస్కూల్, తెనాలి), శృంగవరపు దీపిక(జెడ్పీ హైస్కూల్, గోగులమూడి, పెదనందిపాడు) సాధించారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత నమోదు రాష్ట్రస్థాయిలో జిల్లాకు 16వ స్థానం స్థానం దిగజారినా పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు అధిక మార్కులు సాధించిన పేదింటి ప్రతిభా కుసుమాలు -
రేపు బలసాని కిరణ్కుమార్ నామినేషన్
గుంటూరురూరల్: మరోసారి జగనన్నే ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను అందజేసేందుకు బయలుదేరనున్నానని తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీగా బయలుదేరి ఏటుకూరు మీదుగా ప్రత్తిపాడులోని తహసీల్దారు కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నిమినేషన్ కార్యక్రమంలో పాల్గొని తనను ఆశీర్వదించాలని కోరారు. నేడు పేరంటాళ్లమ్మ కల్యాణం, తిరునాళ్లు వల్లభాపురం(కొల్లిపర): మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలోగల సర్విరెడ్డి పేరంటాలమ్మ దేవస్థానంలో మంగళవారం ఉద యం కల్యాణం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం శిడిమాను ఉత్సవం, తిరునాళ్ల ఉంటాయని పేర్కొన్నారు. భక్తులంతా అమ్మవారిని సందర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోవాలని సభ్యులు కోరారు. ఏలూరి కో–ఆపరేటివ్ బ్యాంక్ శాఖ ప్రారంభం తెనాలి: ఏలూరి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 5వ శాఖ సోమవారం సాయంత్రం తెనాలిలో ప్రారంభమైంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని దేవీచౌక్లో శాఖను కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ, తెనాలి చైర్మన్ డి.ఎల్. కాంతారావు ప్రారంభించారు. స్ట్రాంగ్ రూంను పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం ప్రారంభించగా, లాకర్లను నటరాజ్ జ్యూయలరీ అధినేత కొత్తమాసు కుమార్, బ్యాంక్ డైరెక్టర్ దత్త వెంకట కిరణ్ ప్రారంభించారు. 1999లో తమ బ్యాంక్ను ప్రారంభించినట్టు చైర్మన్ ఏలూరి గురవయ్య చెప్పారు. డైరెక్టర్లు వనమా నరేంద్రకుమార్, టి.శ్రీహరిరావు, సీఈవో కోట శ్రీనివాస్, చీఫ్ మేనేజరు ఎం.వి.ఆర్ శేషుకుమార్, రవిమోహన్ పాల్గొన్నారు. ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 98.45 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యంలోని పాఠశాలల్లో అత్యధికంగా 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. కొరిటెపాడులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన 3287 మంది విద్యార్థుల్లో 3236 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 15 బాలుర పాఠశాలలతో పాటు 14 బాలికల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కలకడలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పి.లిఖిత అత్యధికంగా 597 మార్కులు సాధించినట్లు తెలిపారు. 11వ అదనపు జిల్లా జడ్జిగా శ్రీనివాస్ తెనాలిరూరల్: తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ స్వాగతం పలికారు. న్యాయమూర్తికి ఇటీవల కొత్తగా ఎన్నికై న బార్ అసోసియేషన్ కమిటీని పరిచయం చేశారు. -
ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్
గుంటూరువెస్ట్: గుంటూరు పార్లమెంట్ స్థానానికి సోమవారం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డికి టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ పెమ్మసాని, రవిశంకర్ పెమ్మసాని నామినేషన్ పత్రాలు అందజేశారు. వీరితోపాటు బొమ్మసాని ముత్యాలరావు (ఆల్ పీపుల్స్ పార్టీ), షేక్ ఖాజావలి (ఇండిపెండెంట్), మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ చిష్టి పాషా (ఏపీ రాష్ట్ర సమితి) విష్ణురెడ్డి(బెంగళూరు నవ నిర్మాణ పార్టీ)లు నామినేషన్లు దాఖలు చేశారు. క్షమాపణలు చెప్పిన పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనచోదకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే వాహనచోదకులకు కలిగిన అసౌకర్యానికి పెమ్మసాని విలేకరుల ముందు క్షమాపణలు కోరారు. పోలీసులపై దురుసు ప్రవర్తన పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా కలెక్టరేట్లోకి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలీసులు ఆయనతోపాటు మరో నలుగురిని పంపారు. వెనుకనే మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాళ్లు నరేంద్ర, తెనాలి శ్రావణ్కుమార్లు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని సున్నితంగా అడ్డుకుని నచ్చజెప్పబోయారు. వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. మరో రెండు నెలలపాటే మీ ఆటలంటూ కోపంతో ఊగిపోయారు. అయితే పోలీసులు మాత్రం సంయమనం పాటించారు.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement