రేపల్లె: అడవులదీవి సంఘటనకు సంబంధించి వేముల శ్రీసాయి మృతి కేసులో పోలీసులే ప్రధాన నిందితులని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టిన కొద్ది కాలానికే శాంతి, భద్రతలు క్షీణించాయని విమర్శించారు. జాస్మిన్ మృతి చెందిన సంఘటనలో శ్రీసాయి, పవన్కుమార్లను స్థానికులు పట్టుకున్న కొద్దిసేపటికే ఎసై, సిబ్బంది అక్కడి చేరుకున్నారని, ఆవేశంగా ఉన్న స్థానికులను అదుపుచేసి శ్రీసాయి, పవన్కుమార్లను పోలీస్ స్టేషన్కు తరలించి ఉంటే శ్రీసాయి మృతి చెందేవాడా అని ప్రశ్నించారు. యువకులిద్దరినీ కళ్లముందే కొడుతుంటే సిబ్బందిలేరు అంటూ పోలీసులు అసమర్థపాత్ర పోషించటం దురదృష్టకరమన్నారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సర్కిల్ పరిధిలోని అధికారులను అప్రమత్తం చేసి ఉంటే ఓ నిండు ప్రాణం బలికాకుండా ఉండేదన్నారు. సర్కిల్ పరిధిలో హోమ్గార్డు నుంచి సర్కిల్ అధికారి వరకు టీడీపీ నాయకులు చేస్తున్న భూదందాలు, సెటిల్మెంట్లలో, వ్యాపారాలలో భాగస్వాములుగా మారుతుండటం హేయమన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు కొమ్ముకాస్తూ చట్టాన్ని నవ్వులపాలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోని దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొటంతో ప్రజలకు పోలీసులపై విశ్వాçÜం దెబ్బతిందన్నారు. అన్నదమ్ముల్లా కలసి ఉండే అడవులదీవి గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయేందుకు ఈ సంఘటన కారణమయిందని, కల్మషం లేని మనస్సుల మధ్య చిచ్చురేపిందన్నారు. టీడీపీ అధికారం చేపట్టిన రెండేళ్లలో నియోజకవర్గంలో హత్యల పరంపర కొనసాగటం, దౌర్జన్యాలు పెచ్చుమీరడం, భూదందాలు, సెటిల్మెంట్లతో ప్రజలు అశాంతికి లోనవుతున్నారన్నారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జాస్మిన్, శ్రీసాయి మృతిలో నిజనిజాలను నిర్ధారించి దోషులను కఠినంగా శిక్షించాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ, రూరల్ కన్వీనర్లు గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదే వెంకయ్యబాబు, పట్టణ మహిళా కన్వీనర్ కొత్తపల్లి శ్రీవాణి, యువత పట్టణ కన్వీనర్ చిత్రాల ఓబేదు, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జర్లమూడి ప్రశాంత్కుమార్, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా శ్రీనివాసరావు, యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిమటా బాలాజీ, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొమ్మూరి వీరబ్రహ్మేంద్రస్వామి, కౌన్సిలర్ జూలకంటి బుజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీసాయి మృతి కేసులో ప్రధాన ముద్దాయిలు పోలీసులే
Published Thu, Jul 21 2016 7:53 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
క్రేజ్ కా బాప్ వైఎస్ జగన్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్
ఆ విషయంలో నిరూపించుకోవాల్సిన పనిలేదు: సమంత
కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
తప్పక చదవండి
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement