పేకాట అడ్డాపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

పేకాట అడ్డాపై పోలీసుల దాడి

Published Fri, Jul 1 2016 7:20 PM

police attack on Poker Adda

పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముప్పరాజుపాలెంలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఐనవోలు పోలీసులు శుక్రవారం సాయంత్రం ముప్పరాజుపాలెంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా 8మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.9,250 నగదుతోపాటు మూడు బైక్‌లు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

Advertisement
Advertisement