పాఠశాలకు నిధులు మంజూరు చేయాలి | Sakshi
Sakshi News home page

పాఠశాలకు నిధులు మంజూరు చేయాలి

Published Mon, Jun 13 2016 1:05 PM

police officers requests to central minister ashok gajapathi raju over funds to schools development

విజయనగరం: జిల్లా పోలీస్‌ సంక్షేమ పాఠశాలలకు ఎంపీ ల్యాడ్స్‌ కింద పది లక్షల రూపాయలు మంజూరు చేయాలని జిల్లా పోలీస్‌ అధికారులు కేంద్ర మంత్రి అశోక గజపతిరాజును కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రిని ఆదివారం ఆయన బంగ్లాలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఓఎస్‌డీ అప్పలనాయుడు మాట్లాడుతూ, పోలీస్‌ సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో చాలా తక్కువ ఫీజుతో పోలీసు సిబ్బంది పిల్లలతో పాటు బయట వారికి కూడా విద్యనందిస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెయ్యి గజాల స్థలం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ టి.త్రినాథ్, విజయనగరం డీఎస్పీ ఎ.వి.రమణ, డీసీఆర్‌బీ డీఎస్పీ కె.ప్రవీణ్‌కుమార్, ఏఆర్‌ డీఎస్పీ హనుమంతు, వన్‌టౌన్‌ సీఐ వి.వి.అప్పారావు, ఆర్‌ఐ రామకృష్ణ,  పోలీస్‌ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీఆర్‌ సింహచలం (రామా), జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్‌.హిమగిరి,  శ్రీను,  జిల్లా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement