ప్రొద్దుటూరు క్రైం: మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట జరుగుతుందంటే.. అది కొందరు పోలీసుల చలవతోనే అని చెప్పవచ్చు. కొందరు పోలీసు అధికారుల చల్లని చూపు ఉండటం వల్లనే అసాంఘిక కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతున్నాయి. పోలీసు అధికారులు తల్చుకుంటే ఒక్కరు కూడా మట్కా రాయడానికి సాహసించరు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ లాంటి అధికారులు వీటిని ఎంతగా అణచివేయడానికి ప్రయత్నించినప్పటికీ కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఆశీస్సులతో అసాంఘిక కార్యకలాపాలకు బ్రేకు పడటం లేదు. మట్కా మామూళ్ల వ్యవహారం పోలీసు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మట్కా డాన్ నాగేశ్వరరావు నుంచి డబ్బు తీసుకున్నారనే కారణంతో త్రీ టౌన్ ఎస్ఐ మహేష్, ఏఎస్ఐ మునిచంద్రను డీఐజీ రమణకుమార్ ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు అధికారులపై వేటుతో ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటే పొరపాటే అవుతుంది. మరి కొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని పోలీసు శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది.
పెంచిన మొక్కే కాటేసింది..
మట్కా డాన్ నాగేశ్వరరావు చాలా ఏళ్ల నుంచి వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగరం వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను 45 ఏళ్లుగా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద కంపెనీ ఏర్పాటు చేసి మట్కా నిర్వహిస్తున్నప్పటికీ నాగేశ్వరరావు ఎప్పుడూ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కలేదు. అతని అనుచరులు దొరికిన ప్రతి సారి మట్కా డాన్పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకై పోలీసులు రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా అతను పోలీసులపై రూ.లక్షలు వెదజల్లుతూ తన మట్కా సామ్రాజ్యాన్ని ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ వ్యాప్తంగా విస్తరింప చేసుకున్నాడు. ఇలా కొందరు పోలీసులే అతన్ని చిన్న మొక్క నుంచి మహా వృక్షంలా మారడానికి కారకులయ్యారు. అయితే చివరకు పెంచిన మొక్కే పోలీసులను కాటేసింది. దర్యాప్తులో భాగంగా పోలీసుల అదుపులో ఉన్న నాగేశ్వరరావు మామూళ్ల చిట్టా విప్పడం వల్లనే ఎస్ఐ, ఏఎస్ఐలపై వేటు పడింది. ఆదిలోనే అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి ఉంటే మట్కా డాన్గా మారేవాడు కాదని, అతని నేర సామ్రాజ్యం పొరుగు జిల్లాలకు విస్తరించేది కాదని పోలీసు వర్గాల అభిప్రాయం.
ఖాకీల్లో వణుకు పుట్టిస్తున్న మట్కా
Published Fri, Dec 2 2016 10:46 PM
# Tag
Related news
-
మోసాలు, నేరాలే వారి చరిత్ర: సీఎం వైఎస్ జగన్
విప్లవాత్మక మార్పులకు మారుపేరుగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్సార్సీపీ ముందుకెళుతోంది. ఈ జెండా మరో జెండాతో జత కట్టలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాకు మద్దతుగా సిద్ధం అని ఈ జెండా తలెత్తుకుంది. ప్రజల అజెండాగా రెపరెపలాడుతోంది. పేద ప్రజల అభివృద్ధి కోసం 130 సార్లు బటన్ నొక్కాను. మీరు మే 13వ తేదిన ఫ్యాన్ గుర్తుపై రెండు మార్లు బటన్ నొక్కడంతోపాటు మరో వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలి. 48 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులు. పేదల వ్యతిరేకులని ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. (సిద్ధం అని జనం నినాదాలు) అబద్దాలు, మోసాలు, కుట్రల కూటమిపై గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు బృందాన్ని నమ్మితే నట్టేట ముంచడం ఖాయం. ప్రభుత్వ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబం స్టార్ క్యాంపెయినర్గా బయటికి రావాలి. వారంతా మరో వంద మందికి చెప్పి మీ బిడ్డకు తోడుగా నిలవాలి. 2024 ఎన్నికల్లో ‘మన కోసం మనం’ ప్రతి ఒక్కరూ రెండుసార్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. అలా నొక్కితేనే చంద్రముఖి బెడద ఉండదు. పొరపాటు జరిగితే చంద్రముఖి లక లక లక అంటూ సైకిల్పై వచ్చి టీ గ్లాస్ పట్టుకుని మీ ఇంటిలో రక్తం తాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేయడమంటే మన పథకాలు మనమే రద్దు చేసుకోవడం. ఆయన్ను నమ్మడం అంటే మోసం, అబద్ధం, వెన్నుపోటును నమ్మడమే. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం, కుట్రలు చేయడంలో చంద్రబాబుకు 45 సంవత్సరాల అనుభవం ఉందని.. చేయాల్సిన నేరాలన్నీ చేసేసి నెపం వైఎస్సార్సీపీపైకి తోయడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారో, ఎందుకు చంపించారో.. వారితో ఇప్పుడెవరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారో అందరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ, చంద్రబాబు బంధువులవని తేలినా, ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపై నెట్టేందుకు క్షణాల్లో రెడీ అయ్యారని మండిపడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో, గోబెల్స్ ప్రచారంలో, కుటుంబాలను చీల్చడంలోనూ చంద్రబాబు అనుభవాన్ని చూస్తున్నామని ధ్వజమెత్తారు. బుధవారం ఇడుపులపాయలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్.. ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపానని హేయంగా చెప్పుకుని తిరుగుతున్నా ఆ హంతకుడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుంటున్నారు చంద్రబాబు, ఎల్లో మీడియా. ఈ హంతకుడికి రాజకీయ కాంక్షతో ఒకరిద్దరు నా వాళ్లు కూడా మద్దతిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్నను ఓడించిన వారితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వివేకం చిన్నాన్న బతికున్నంత వరకు చంద్రబాబును శత్రువుగా భావించారు. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలతో కుట్రలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు వెన్నుపోటు పొడిచి, చనిపోయిన తర్వాత శవాన్ని లాక్కొని ఊరూరా విగ్రహాలు పెడుతూ దండలు వేస్తున్నారు. నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలి. నన్ను దెబ్బ తీసేందుకే కుట్రలు చేస్తున్నారు. ఇది కలియుగం కాక మరేమిటి? ఎవరెన్ని కుట్రలు పన్నినా నేను మాత్రం ప్రజల పక్షమే. ఆ దేవుడు, ప్రజల్నే నమ్ముకున్నా. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా. ప్రజలకు మంచి చేసిన చరిత్ర మనది. వారిలా వంచించిన చరిత్ర మనకు లేదు. మేనిఫెస్టోలో పది శాతం వాగ్దానాలు కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలుగా భావించి, త్రికరణ శుద్ధిగా 99 శాతం వాగ్దానాలను అమలు చేసి నిలబెట్టుకున్న చరిత్ర మన ప్రభుత్వానిది. ఈ తేడాను ప్రజలందరూ గమనించాలి’ అని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వారు చంద్రబాబు వదినమ్మ బంధువులు ► బ్రెజిల్ నుంచి చంద్రబాబు వదిన గారి చుట్టం డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ను దిగుమతి చేసుకుంటూ విశాఖపట్నంలో సీబీఐ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, చంద్రబాబు బంధువులు దొరికితే చివరికి ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపైన నెట్టేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. చంద్రబాబు వదినమ్మ, ఆమె కొడుకు, వియ్యంకుడు తదితరులు డైరెక్టర్లుగా వ్యవహరించిన కంపెనీకి సంబంధించిన ఈ వ్యవహారంలో బుకాయిస్తూ మనపై బురదజల్లుతున్నారు. ► 45 సంవత్సరాలుగా క్షుద్ర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు బంధువులు అడ్డంగా దొరికితే.. వైఎస్సార్సీపీ వాళ్లని నీచ రాజకీయాలు చేస్తున్న వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు పత్రికను చదువుతుంటే ఛీ ఇదొక పేపరా అనిపిస్తోంది. కేంద్రం నుంచి ఒక పార్టీని పరోక్షంగా, మరొక పార్టీని ప్రత్యక్షంగా తెచ్చుకుని అందరూ కలిసి ఒక్క జగన్తో యుద్ధం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, నా ఇద్దరు చెల్లెళ్లు కలిసి నాపై యుద్ధానికి సిద్దమయ్యారు. మంచి చేసి చూపించాడు మీ బిడ్డ ► రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్షేమం, అభివృద్ధిని 58 నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో నాలుగు అడుగులు వేసినా సచివాలయ వ్యవస్థ కనిపిస్తోంది. అందులో మన పిల్లలు పది మంది ఉద్యోగం చేస్తుండడం కనిపిస్తోంది. 1వ తేదీ ఇంటి వద్దకు చిక్కటి చిరునవ్వుతో అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు వారి మనవళ్లు విచ్చేసి సెలవు దినమైనప్పటికీ పింఛన్ అందజేస్తుండటమూ కనిపిస్తోంది. ► రూ.3 వేలు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నాం. మన తర్వాతి స్థానంలో తెలంగాణ రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మిగతా రాష్ట్రాలు రూ.8, 6, 4 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. లంచాలు, వివక్షకు ప్రతిరూపాలైన జన్మభూమి కమిటీలు లేనటువంటి వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఓటు వేయని వారికి కూడా పథకాలు అందిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే సాధ్యమైంది. ► మీ బిడ్డ డీబీటీ ద్వారా బటన్ నొక్కడంతో అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతోంది. రూ.2.70 లక్షల కోట్లు ఖాతాల్లో నేరుగా జమ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ వంటి అంతర్జాతీయ స్థాయి బోధన, ట్యాబ్లు, ఐఎఫ్బీ, డిజిటల్ బోధన వంటివి ఒక్కసారి పాఠశాలలో కూర్చొని చూస్తే గుర్తుకు వచ్చేది వైఎస్ జగన్, వైఎస్సార్పీపీ ప్రభుత్వమే. రైతన్నకు తోడుగా నిలిచింది, రైతన్నకు సాయంగా రైతు భరోసా సొమ్మును అందించడం, రైతన్నకు తోడుగా అసైన్డ్ భూములు, 22ఏ భూములపై శాశ్వత భూ హక్కులు అందించడంలో అడుగులు వేగంగా పడ్డాయి. ► ప్రొద్దుటూరు గడ్డపై లక్షల సంఖ్యలో ఉన్న సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంతటి గొప్ప సభ గతంలో ఇక్కడ ఎప్పుడూ లేదు. జనసంద్రం కని్పస్తోంది. దుష్ట చతుష్టయాన్ని నిలువరించడమే లక్ష్యంగా ఎన్నికల సమరంలో పోరాడేందుకు గాండీవంతో అర్జునుడిగా నేను సిద్ధం.. శ్రీకృష్ణులుగా మీరు పాంచజన్యం పూరించేందుకు సిద్దమా? (ముక్తకంఠంతో మేమంతా సిద్ధమేనని జనం బదులిచ్చారు). సామాజిక న్యాయానికి పెద్దపీట ► నిరుపేదలకు తోడుగా సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేసి చూపిస్తున్న ప్రభుత్వం మనదే. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలందరికీ కులం, మతం, రాజకీయం చూడకుండా సామాజిక న్యాయం అమలు చేసి చూపెట్టాం. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఎస్సీలను తూలనాడితే వారు ఎలా బతుకుతారు? మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్లపై చెలగాటమాడితే వారంతా ఎక్కడికి వెళ్లాలి? ► స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ కాగా, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఈ ఉద్యోగాల్లో 80 శాతం నా.. నా.. నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే ఉద్యోగాలు పొందడం సామాజిక న్యాయం కాదా? రాష్ట్రంలో 31 లక్షల ఇళ్లను అక్కాచెల్లెమ్మల పేరుమీద ఇచ్చాం. ఇందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్క ప్రొద్దుటూరులోనే 24 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చింది మీ బిడ్డ వైఎస్ జగనే. ప్రతి అక్క, చెల్లెమ్మకు రూ.5–20 లక్షల వరకు ఆస్తిని ఇంటి రూపంలో ఇస్తోంది వైఎస్సార్సీసీ ప్రభుత్వమే. ► అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేసి సామాజిక న్యాయం అమలు చేశాం. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాలన్నీ మహిళా సాధికారతను తీసుకు వచ్చాయి. అక్కాచెల్లెమ్మలు ధైర్యంగా బయటికి వస్తే దిశ యాప్ ఉంది. రక్షణ కోసం గ్రామాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ► గ్రామాల్లో నాలుగు అడుగులు వేయగానే విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో అందరికీ ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ సాధ్యమైంది. 104, 108 కొత్త అంబులెన్స్లు కుయ్... కుయ్ మంటూ సేవలు అందిస్తున్నాయి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు పథకాలు తీసుకు రాగా, ఆయన తనయుడిగా మీ బిడ్డ ఆరోగ్యశ్రీని మరింత ఉన్నతీకరించి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చేశారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. 10 షిప్పింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎయిర్పోర్టుల విస్తరణపై దృష్టి సారించాం. పారిశ్రామిక కారిడార్లో భాగంగా పక్కనే ఉన్న బద్వేలులో సెంచురీ ఫ్లై బోర్డ్ పరిశ్రమను ప్రారంభించాం. రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. కోవిడ్ ఉన్నా ఎక్కడా తగ్గకుండా, సాకులు చెప్పకుండా మీ అవసరం రాష్ట్ర అవసరంగా భావించి 58 నెలల కాలంలో 130 సార్లు బటన్ నొక్కాను. విలువలకు అండగా నిలవాలి ► 2014లో మోదీ, దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల సమయంలో వారు రూపొందించిన అబద్ధాల పాంప్లేట్ ప్రతి ఇంటికి పంపారు. టీవీలు, పేపర్లలో యాడ్స్ వేశారు. రైతులకు రుణమాఫీ, పొదుపు సంఘాలకు రుణమాఫీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి, రూ.10 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్, సింగపూర్ను మించిన రాజధాని, ప్రతి జిల్లాకు హైటెక్ నగరం, మూడు సెంట్ల భూమి వంటి హామీలు ఇచ్చారు. వీటిలో ఒక్కటైనా అమలయ్యాయా? ప్రత్యేక హోదా ఇచ్చారా? (లేదు.. లేదని ప్రజల నినాదాలు) ► మళ్లీ ఇదే బ్యాచ్ ఎన్నికల్లో ఇప్పుడు ప్రజల ముందుకు వస్తోంది. వీరు కొత్త మేనిఫెస్టోలో కిలో బంగారం, బెంజ్ కారు, సూపర్ సిక్స్, సెవెన్ అంటూ మరోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యారు. దేశ చరిత్రలో ఇలాంటి రాజకీయాలు ఎక్కడా లేవు. విశ్వసనీయత, విలువలకు ప్రతీకగా నిలుస్తున్న మీ బిడ్డ నోటిలో నుంచి ఒక్కమాట వస్తే దానిని అమలు చేసిన తర్వాతే ఓటు అడుగుతున్నాం. విలువల రాజకీయానికి, పొత్తుల రాజకీయానికి మధ్య జరుగుతున్న పోరులో విలువలకు అండగా నిలవాలి. ► ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఇంటి బయట ఉండాలి.. తాగిన టీ గ్లాస్ సింక్లో ఉండాలి. జరుగుతున్న ఎన్నికలు పేదల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. పొరపాటు జరిగితే పేదల బతుకులు అంధకారమవుతాయి. ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్దమా? (సిద్ధమే అని సెల్లో టార్చ్ ఆన్ చేసి చేతులు పైకెత్తారు.) ► 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు సాధించడమే మనందరి లక్ష్యం. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం కూడా తగ్గడానికి వీలు లేదు. ► ఒకే ఒక్కడి మీదకు ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేకపోవడానికి కారణం దేవుడి దయ, కోట్లాది మంది ప్రజల గుండెల్లో చోటు ఉండడమే. 75 సంవత్సరాల చంద్రబాబు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ఎన్నికల సమయానికి కొత్త మేనిఫెస్టో, కొత్త వాగ్దానాలతో రొటీన్గా వంచన చేస్తారు. ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా జత కడతారు. ఢిల్లీ దాక వెళ్లి కాళ్లయినా పట్టుకుంటారు. విశ్వసనీయత, విలువలు లేని వీళ్ల రాజకీయాలు ఎవరికి స్ఫూర్తినిస్తాయి? మన మంచిని ప్రతి ఇంటా చెప్పాలి మన ప్రభుత్వం పరిపాలనలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిందని, మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. అమ్మ ఒడి, చేయూత, సున్నా వడ్డీ పథకం, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, రైతు భరోసా, వాహనమిత్ర మొదలు నేతన్న నేస్తం వరకు మనం అందించే పథకాల ద్వారా లబ్ధి పొందిన విషయాలను ఇంటింటికి తీసుకువెళ్లండి. ఈ పథకాలన్నీ అమలు కావాలన్నా, అవ్వాతాతలకు పెన్షన్లు సకాలంలో రావాలన్నా, మెరుగైన రేషన్ ఇంటికి రావాలన్నా, నాణ్యమైన విద్య, విదేశీ విద్య, వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్, పేదవాడికి మెరుగైన వైద్యం, ఆర్బీకేలు, రైతు భరోసా, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇన్ఫుట్ సబ్సిడీ తదితర పథకాలన్నీ కొనసాగాలంటే ‘జగన్ రావాలి...వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రావాలి’ అని తెలియజేయాలి. ఆత్మీయంగా అభ్యర్థుల పరిచయం ‘కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా తమ్ముడు వైఎస్ అవినాష్రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తున్న సోదరుడు ప్రసాద్రెడ్డి, కమలాపురం నుంచి మామ పి.రవీంద్రనాథ్రెడ్డి, బద్వేలు నుంచి పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ సుధమ్మ, జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తున్న సోదరుడు సుధీర్రెడ్డి, కడప నుంచి పోటీ చేస్తున్న నవాబ్ సాబ్ అంజద్బాష, మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న పితృ సమానులైన ఎస్.రఘురామిరెడ్డి, పులివెందుల నుంచి పోటీ చేస్తున్న నాపై మీ అందరి చల్లని ఆశీస్సులు ఉంచాలి’ అని సీఎం జగన్ కోరారు. అనంతరం వేదికపై ఉన్న నాయకులను పేరుపేరునా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా పాలన ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేలా జగనన్న పరిపాలన కొనసాగుతోంది. ఈ ఐదేళ్లలో ఆయన ఆలోచనలతో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. పరిపాలనను గ్రామ స్థాయికి, ప్రభుత్వ సేవలను ఇంటివద్దకే చేర్చారు. ఇవాళ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. పెన్షన్లు, ఇళ్ల కోసం ఏ ఒక్కరి దగ్గరికీ వెళ్లి చేయి చాచాల్సిన పనిలేదు. రెండేళ్లు కోవిడ్తో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతి వాగ్దానాన్ని జగనన్న నిలబెట్టుకున్నారు. ప్రొద్దుటూరులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో జగనన్న ప్రభుత్వం రూ.200 కోట్లను వెచ్చించి స్థలం కొనుగోలు చేసి 25 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చింది. ఇవాళ గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోగలుగుతున్నాం. జగనన్న ప్రభుత్వం రాకముందు కనీసం ఐదు టీఎంసీలు కూడా అక్కడ నిల్వ చేయలేని దుస్థితి. దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేసి ఇవాళ అక్కడ 27 టీఎంసీల నీటిని స్టోరేజీ చేసుకుంటున్నాం. సీబీఆర్లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నింపుతున్నాం. ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే పరిస్థితి లేకపోవడంతో విపక్షాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయి. చంద్రబాబుకు బలం, ధైర్యం లేవు కాబట్టే జనసేన, బీజేపీని తోడు తెచ్చుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా సరే జగనన్నకు తిరుగులేదు. – వైఎస్ అవినాష్రెడ్డి, కడప ఎంపీ మళ్లీ మీరే సీఎం.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీఎం జగన్ తొలి సభను నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,700 కోట్లను అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ అందించారు. దాదాపు రూ.1,300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగా, 24 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. ఉమ్మడి కడప జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకుంటాం. – రాచమల్లు శివప్రసాదరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే -
నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారు: సీఎం జగన్
వైఎస్సార్, సాక్షి: ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, మోసాలు చేయడంలో చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తపించిపోతున్న ఒకరిద్దరు నావాళ్లు భాగం అయ్యారు. ఇంతటి దారుణం చేసి.. నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా.. నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా. నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పేవారు, కుట్రలు చేసేవాళ్లు మనకు శత్రవులుగా ఉన్నారు. అందరూ కలిసి జగన్పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. వీళ్ల విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా, దేవుడి దయ ఉన్నాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
LIVE: ప్రొద్దుటూరులో సీఎం జగన్ భారీ బహిరంగ సభ
LIVE: ప్రొద్దుటూరులో సీఎం జగన్ భారీ బహిరంగ సభ -
ప్రొద్దుటూరు మేమంత సద్ధం బహిరంగ సభలో భారీ జనం
ప్రొద్దుటూరు మేమంత సద్ధం బహిరంగ సభలో భారీ జనం -
సీఎం జగన్ మీటింగ్ ఆలస్యం.. ఇసుక వేస్తే రాలనంత జనం
సీఎం జగన్ మీటింగ్ ఆలస్యం.. ఇసుక వేస్తే రాలనంత జనం
Related News by category
-
‘ఆప్’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతీకి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఆసుపత్రి ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్ధారణ కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తున్నట్లు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర పాండే శనివారం స్పష్టం చేశారు. రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమ్నాథ్ భారతీకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. 2016 సెప్టెంబర్ 9న సోమ్నాథ్ భారతీ మరో 300 మందితో కలిసి ఎయిమ్స్ ప్రహరీ గోడపై ఉన్న ఫెన్సింగ్ను ధ్వంసం చేసినట్లు కేసు నమోదయ్యింది. అంతేకాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో 2014లో అర్ధరాత్రి సమయంలో ఓ ఆఫ్రికా మహిళపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. -
కరోనా వ్యాక్సిన్ ‘రెడీ టూ యూజ్’ : రష్యా మంత్రి
మాస్కో: కరోనా వైరస్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వేగంగా కదులుతున్న రష్యా మరో కీలక విషయాన్ని ప్రకటించింది. తమ దేశానికి చెందిన కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ వాడకానికి వచ్చే నెలలోనే సిద్ధంగా ఉంటుందని ఉప రక్షణ మంత్రి రుస్లాన్ సాలికోవ్ ప్రకటించారు. మాస్కోకు చెందిన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాలికోవ్ ఈ విషయం చెప్పారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. తమ వ్యాక్సిన్కు సంబంధించిన మొదటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశామని సాలికోవ్ తెలిపారు. ముఖ్యంగా రెండవ దశ పరీక్షలు విచారణ సోమవారం ముగిసాయనీ, వీరందరూ కరోనావైరస్ నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నారని, త్వరితంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను వేలాదిమందిపై త్వరలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఎపుడు మొదలుపెట్టేదీ, టీకా ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన స్పష్టంగా ప్రస్తావించలేదు. మరోవైపు సాలికోవ్ చేసిన వాదనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. కాగా మాస్కోలోని ప్రభుత్వ సంస్థ గమలేయ ఇన్స్స్టిట్యూట్ అండ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో కరోనావైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్టు రష్యన్ ఆర్మీ ఇటీవల ప్రకటించింది. రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వేలాది మంది వాలంటీర్లతో దశ-3 మానవ క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయనీ, టీకా పంపిణీ సెప్టెంబరు నాటికి ప్రారంభమవుతుందని (ఆర్డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రోవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిమిత్రోవ్ ప్రకారం, దేశీయంగా 30 మిలియన్ మోతాదులను, అంతర్జాతీయంగా170 మిలియన్లను తయారు చేయనుంది. వ్యాక్సిన్ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపాయి. -
శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరిదేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాదిలానే తెలంగాణా నుంచి అమ్మ వారికి బోనాలను సమర్పించేందుకు ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం ఇంద్రకీలాద్రికి విచ్చేయనుంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మ వారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్త బృందాలు అమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే ఉత్సవాలు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తాయి. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటలకు అమ్మ వారి దర్శనాన్ని నిలిపివేస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు అమ్మ వారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాలను, మూలవిరాట్లకు కాయగూరలు, పండ్లు, డ్రైప్రూట్స్తో అలంకరిస్తారు. ఆలయాలను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించేందుకు అవసరమైన కూరగాయల దండలను సేవా సిబ్బంది, భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఊరేగింపుగా బోనాలు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనాలను సమర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అమ్మ వారి ఆలయానికి చేరుకుంటుంది. కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ అమ్మ వారి అలంకరణకు తొలి రోజైన ఆదివారం ఆకుకూరలను వినియోగిస్తారు. రెండో రోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడో రోజైన మంగళవారం బాదం, జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ప్రూట్స్తో అలంకరిస్తారు. అమ్మ వారి అలంకరణకు ఉపయోగించిన ఆకుకూరలు, కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడు రోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకూకూరలను దండలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తుంటారు. దేవస్థానం కదంబం ప్రసాదాన్ని అమ్మ వారి మహా ప్రసాదంగా భక్తులకు వితరణ జరుగుతుంది. దేవస్థాన ఉచిత ప్రసాదాల కౌంటర్లో కదంబం ప్రసాదాన్ని వితరణ చేస్తారు. నేడు లక్ష మంది దర్శనం ఒక వైపు శాకంబరిదేవి ఉత్సవాలు, మరో వైపున తెలంగాణా నుంచి బోనాలు, ఆదివారం, ఆషాఢ సారెను సమర్పించేందుకు తరలివచ్చే భక్త బృందాలతో ఇంద్రకీలాద్రిపై పండుగ శోభ నెలకొంది. ఒకే రోజు మూడు విశేషమైన ఉత్సవాలు జరుగుతుండటంతో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష పైబడి భక్తులు అమ్మ వారి దర్శనానికి విచ్చేసే అవకాశముందని భావిస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మ వారి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి. మరో వైపున ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా షామియానాలు, మంచినీటి సదుపాయాలను దేవస్థాన కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. -
నారాజ్ చేయొద్దు
రైతు: రాజు, ఏదులాపూర్, శివ్వంపేట మండలం 139/2 సర్వే నంబర్లో 26. 1/2 (ఇరువై ఆరున్నర గుంటల) భూమి కుమారి సులోచనపై రిజిస్ట్రేషన్ చేయించాము. కాని కొత్త పాస్బుక్లో 20.1/2(ఇరవైన్నర) గుంటల భూమి ఉన్నట్లు నమోదు చేశారు. మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే గ్రామశివారులోని ముత్తయ్య చెరువు కాలువను దాడ్వాయి అశోక్ అనే వ్యక్తి పూడ్చేశారు. ఈ విషయంపై ముత్యాలు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: పాత రికార్డుల ప్రకారం ఎంత ఉంటే అంతా సర్వే చేయిస్తాము. ముతయ్య చెరువు కాలువ పూడ్చివేత పై చర్యలు తీసుకుంటాను. సాక్షి మెదక్/మెదక్ రూరల్: సాధాబైనామాలో భూమి తగ్గింది రైతు: రెడ్డిగారి వీరమణి, యెనగండ్ల గ్రామం, కొల్చారం మండలం కొల్చారం మండలం యెనగండ్ల గ్రామశివారులో గల 62 సర్వే నంబర్లో 2.4 ఎకరాల పట్టా భూమి ఉండగా, సాధాబైనామా తర్వాత అందులో 12 గుంటల భూమి తగ్గించి మంగళి ఆగమయ్య పేరిట నమోదు చేశారు. సంబంధిత తహసీల్దార్కు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. జేసీ: మీ సమస్య గురించి సంబంధిత తహసీల్దార్తో మాట్లాడి పరిష్కరిస్తాను. ప్రభుత్వం ఇచ్చిన భూమిని కబ్జా చేశారు రైతు: నర్సయ్య, నిజాంపేట మండలం, నస్కల్ గ్రామం గ్రామ శివారులో గల 229/అ సర్వే నంబర్లో నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి ఇచ్చారు. అందులో తమకు ఇచ్చిన 1.15 ఎకరాల భూమిని ఇతరులు కబ్జా చేశారు. అధికారులను పొజిషన్ చూపించాలని కోరితే పట్టించుకోవడం లేదు. జేసీ: సర్వేయర్ను పంపించి సమస్యను పరిష్కరిస్తాము. ఐదు గుంటలు తక్కువ నమోదు చేశారు రైతు: లక్ష్మీనర్సయ్య, నిజాంపేట మండలం, కె. వెంకటాపూర్ గ్రామం గ్రామ శివారులోని 315, 316, 317 సర్వే నంబర్లలో మొత్తం 2 ఎకరాల పట్టా భూమి ఉంది. కాని కొత్త పాస్బుక్లో 5 గుంటల భూమిని తగ్గించి నమోదు చేశారు. జేసీ: సంబంధిత మండల రెవెన్యూ అధికారులకు చెప్పి న్యాబద్ధమైనదైతే సరిచేస్తాము. పాస్బుక్కులు ఇవ్వలేదు రైతు: నర్సింలు, రామాయంపేట రామాయంపేట శివారులోని 1421 సర్వే నంబర్లో గల లవాణీ పట్టా భూమికి సంబంధించి 15 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చి పాస్బుక్కులను ఇవ్వలేదు. జేసీ: ఆ భూమిలో ఏం పంటలు సాగు చేస్తున్నారు. సర్వేయర్ను పంపించి వారం రోజుల్లోగా పాస్బుక్కులను ఇప్పిస్తాము. మా భూమిని కబ్జా చేశారు రైతు: నర్సింలు, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలం గ్రామ శివారులోని 234 సర్వే నంబర్లో ఉన్న అసైన్డ్ భూమికి సంబంధించి 1977లో తాత పేరిట సర్టిఫికెట్ ఇచ్చారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లాము. ప్రస్తుతం తమ భూమిని పక్క పొలం వ్యక్తి కబ్జా చేశాడు. జేసీ: మూడేళ్లకు మించి ఆ భూమిలో పొజిషన్లో లేకుంటే ప్రభుత్వం రద్దు చేస్తుంది. భూమిని సాగు చేస్తున్న వాళ్లకే వర్తిస్తుంది. భూ సమస్యను పరిష్కరించండి రైతు: సూర్యం చౌహాన్, బిక్యాతండా, శివ్వంపేట మండలం పంచాయతీ పరిధిలో గల 315, 316 సర్వే నంబర్లో ఉన్న భూ సమస్యను పరిష్కరించి రైతులకు పాస్బుక్కులు అందించగలరు. జేసీ: భూమి ఉన్నదాని కంటే ఎక్కువ ఉండటం వల్ల ఫారెస్ట్ అధికారులు గెజిట్ పబ్లికేషన్ తీసుకొచ్చి హద్దులు వేశారు. సమస్య ఉన్నందున ఆ భూమిని పార్ట్ బీలో పెట్టడం జరిగింది. సర్వే చేయించి సమస్య పరిష్కరించి పాస్బుక్లను అందిస్తాము. లవాణీ పట్టా కొనుగోలు చేశాం రైతు: నర్సింగ్, చిన్నచింతకుంట గ్రామం, నర్సాపూర్ గ్రామ శివారులోని 918 సర్వే నంబర్లో లవాణీ పట్టాను కొనుగోలు చేశాము. పట్టా చేయడం లేదు. జేసీ: హెచ్ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి చట్ట ప్రకారం పట్టా కాదు. పాస్బుక్ ఇప్పించండి రైతు: సిద్ధయ్య, వడియారం గ్రామం, చేగుంట మండలం సర్వే నంబర్ 642లో గల 32 గుంటల ఇనాం భూమికి సంబంధించి పాస్బుక్ రాలేదు. జేసీ: ఓఆర్సీ ఇప్పించి 10 రోజుల్లో పాస్బుక్లను అందిస్తాము. ఒకే భూమిని ఇద్దరికి విక్రయించారు రైతు: వహీబ్ఖాన్, నర్సాపూర్ సర్వే నంబర్ 17/12లో గల లవాణీ పట్టా భూమిని 1989లో తీసుకున్నాము. కాని అదే భూమిని 2006లో ఇతరులకు విక్రయించారు. ఇలా ముగ్గురి పేర్లమీద ఉంది. జేసీ: ఆ భూమిని ఎవరూ కొనడానికి వీలులేదు. అందులో చేపట్టిన నిర్మాణాలను పడగొట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటాము. భూమిని మ్యూటేషన్ చేస్తలేరు రైతు: శ్రీనివాస్, రాజ్పల్లి, మెదక్ మండలం సర్వే నంబర్ 427/అ 2లో గల 13 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించాము. కాని మోటేషన్ చేయమంటే సంబంధిత వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాము. అధికారులు పట్టించుకోవడం లేదు రైతు: విభూది రాచప్ప, దొంతి గ్రామం, శివ్వంపేట మండలంతల్లి ఎల్లమ్మ పేరిట ఉన్న 8గుంటల పట్టా భూమిని పౌతి చేయమంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకుంటాను. నా భూమి వేరే వ్యక్తి పేరిట నమోదైంది రైతు: నారాయణ, శివాయిపల్లి, మెదక్ మండలం 43/ఇ2 సర్వేనంబర్లో గల 13 గుంటల బారాణ భూమిని నా పేరుతో ఉన్న మరో వ్యక్తి అయిన నారాయణ పేరిట నమోదయ్యింది. మా పేర్ల పక్కన తండ్రి పేరును గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సమస్య పరిష్కరించాలని వీఆర్వో, ఎమ్మార్వోల చుట్టూ తిరిగినా పట్టించుకోవడవం లేదు. జేసీ: వారం రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను. పాస్బుక్కులు ఇవ్వలేదు రైతు: బిక్షపతి, రాయిలాపూర్, కౌడిపల్లి మండలం 394, 387 సర్వే నంబర్లో ఉన్న రైతులకు ఎవరికి పాస్బుక్కులు రాలేవు. దీంతో రైతుబంధు, రైతుబీమా డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. జేసీ: వారం రోజుల్లో సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తాను. ఇద్దరికి చెందాల్సిన భూమిని ఒక్కరికే ఇచ్చారు రైతు: శంకరయ్య, ఎల్లుపల్లి, టేక్మాల్ మండలం 141 సర్వే నంబర్లో గల 21 గుంటల భూమి శంకరయ్య, సుధాకర్ల పేరు మీద ఉంది. కాగా సాధా బైనామాలో ఇద్దరికి చెందిన భూమిని సుధాకర్ ఒక్కిరి పేరిట రాసారు. జేసీ: ఆర్డీఓకు ఆర్ఓఆర్ అప్పీల్ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. పాస్బుక్ రాలేదు రైతు: విజయ్కుమార్, కోనాపూర్ గ్రామం, రామాయంపేట433/202 సర్వే నంబర్లో గల ఎకరం లవాణీ పట్టా భూమికి సంబంధించి పాస్బుక్ రాలేదు. జేసీ: పార్ట్ బీలో ఉన్నందు వల్ల పాస్బుక్ రాకుండవచ్చు. సర్వేచేయిస్తాను. రిజిస్ట్రేషన్ చేసినా బుక్లో నమోదు చేస్తలేరు రైతు: కుమ్మరి మల్లేషం, శెట్టిపల్లి గ్రామం, వెల్ధుర్తి మండలం గ్రామ శివారులో 38 సర్వే నంబర్లో 14 గుంటల పట్టా భూమిని కొనుగోలు చేసి 2006 రిజిస్ట్రేషన్ చేయించాము. కాని బుక్లో నమోదు చేయడం లేదు. అలాగే 289, 38 సర్వే నంబర్లలో ఉన్న భూమిలో 15 గుంటల భూమి తక్కువ వస్తుంది. సంబంధిత ఎమ్మార్వో, వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: మీసేవలో పెట్టిన దరఖాస్తు ఉందా. మీసేవలో రూ.145 చెల్లించి నమోదు చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మీసేవ రశీదును వాట్సప్కు పెట్టండి. కొన్న భూమిని కోల్పోవాల్సి వస్తుంది రైతు: రఘుపతి, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలంగ్రామ శివారులోని 260 సర్వే నంబర్లో గల 35 గుంటల పట్టా భూమిని మా తండ్రి లక్ష్మీనారాయణ పేరిట కొనుగోలు చేశాము. కాని 266 సర్వే నంబర్లో ఉందంటున్నారు. కాగా 260 సర్వే నంబర్లో గల భూమి జాతీయ రహదారి విస్తరణలో పోతుంది. సమస్యను పరిష్కరించండి. జేసీ: రికార్డు ప్రకారం సర్వే నంబర్లో ఉన్న భూమిపై హక్కు ఉంటుంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. లేకుంటే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. బీఈడీ ఎంట్రెన్స్లో నిజాంపేట వాసికి 13వ ర్యాంక్ నిజాంపేట(మెదక్): నిజాంపేట గ్రామానికి చెందిన యువకుడు బీఈడీ ఎంట్రెన్స్ పరీక్షలో సాంఘీకశాస్త్ర్రంలో 13వ ర్యాంక్ సాధించాడు. ఈ మేరకు నిజాంపేట గ్రామానికి చెందిన వోగుల సురేష్ గత నెల 31న జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా మంచి ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా 13వ ర్యాంక్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు పెద్దశంకరంపేట(మెదక్): వర్షాలు సమృద్ధిగా కురియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడిచంద్రశేఖర్శర్మ హనుమాన్ ఆలయంలో చందనోత్సవం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కేవీపీఎస్ జిల్లా కమిటీ ఎన్నిక నర్సాపూర్: కుల వివక్ష వ్యతిరేఖ పోరాట సమితి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నర్సాపూర్లో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా మహా సభల్లో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా తుకారం, నాగరాజులు ఎన్నికయ్యారు. తమతో పాటు 19 మందితో కూడిన జిల్లా కమిటీని ఎంపిక చేశారని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని వారు పేర్కొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి మనోహరబాద్(తుప్రాన్): వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృచెందారు. ఎస్ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. కూచారం గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ(35) తన ఇంటి ముందు ఉన్న ట్రాక్టర్ను పక్కకు పెట్టడానికి కింద నిలబడి స్టార్ట్ చేయగా గేర్లో ఉన్న ట్రాక్టర్ అకస్మాత్తుగా అతనిపైనుంచి వెళ్లింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీకొని.. కొనాయిపల్లి (పీటీ)గ్రామానికి చెందిన శెట్టి బాబు (28) తన బైక్పై పనినిమిత్తం రంగాయిపల్లి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీ చేసినట్లు సీడీపీఓ సోమశేఖరమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దశంకరంపేట అంగన్వాడీ టీచర్, గడిపెద్దాపూర్ తండా మినీ అంగన్వాడీ టీచర్, అల్లాదుర్గం మండలం గొల్లకుంట, రేగోడ్ మండలం కొండాపూర్, జంగంలోంక తండా, టేక్మాల్ మండలం పల్వంచ, పెద్దశంకరంపేట మండలం ఉతూలుర్ గ్రామల అంగన్వాడీ ఆయా పోస్టులు భర్తీ చేయడమైందని, పోస్టులు పొందినవారు అల్లాదుర్గం ఐసీడీఎస్ కార్యాలయంలో ఉత్తర్వులు తీసుకుని జాయినింగ్ కావాలని ఆమె తెలిపారు. పోస్టుల లిస్టు కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు. నాలుగు మండలాల్లో.. రామాయంపేట(మెదక్): స్థానిక ఐసీడీఎస్ పరిధిలోని రామాయంపేట, నార్సింగి, చేగుంట, వెల్దుర్తి మండలాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను ఎంపిక కార్యక్రమం పూర్తయిందని స్థానిక ప్రాజెక్టు సీడీపీవో స్వరూప తెలిపారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కోనాపూర్, మక్కరాజ్పేట, శంఖాపూర్, బోనాల గ్రామాల్లోని ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. మక్కరాజ్పేట, శంఖాపూర్, బోనాల, రామాయపల్లి సెంటర్లలో హెల్పర్లు, మినీ కేంద్రాలైన కోనాపూర్ పెద్ద తండా, చిన్నతండాలో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని ఆమె తెలిపారు. ఎంపికైనవారి వివరాలు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని, లిస్టు చూసుకోవాలని ఆమె సూచించారు. కాయిదంపల్లిలో పింఛన్ల పంపిణీ అల్లాదుర్గం(మెదక్): గురువారం సాక్షి దినపత్రికలో పింఛన్ పాట్లు అనే శీర్షికతో వార్త ప్రచురితం అయింది. గ్రామాల్లో పింఛన్ ఇవ్వడం లేదని, పోస్టాఫీస్లో పింఛన్లు ఇవ్వడంతో గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన పోస్టల్ సిబ్బంది శుక్రవారం కాయిదంపల్లి గ్రామానికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెల గ్రామాల్లోనే పింఛన్లు పంపిణీ చేయిస్తామని ఎంపీడీఓ విద్యాసాగర్ చెప్పారు. -
అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్
కోదాడ : చదువులో తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్న సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రీడా సమరానికి సూర్యపేట జిల్లా, కోదాడ మండలంలోని నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల ఆతిథ్యం ఇస్తోంది. గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా బుధవారం ఈ క్రీడాసమరానికి తెరలేవనుంది. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఐదో జోనల్ మేట్-2018లో అండర్-17 విభాగంలో 28 పాఠశాలల బాలికలు, అండర్-19 విభాగంలో 33 కళాశాలల 1840 మంది విద్యార్థినులు తమ సత్తా చాటనున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
Advertisement