పుష్కర ఘాట్‌లో పోలీసుల ప్రతాపం | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్‌లో పోలీసుల ప్రతాపం

Published Tue, Aug 16 2016 10:00 AM

పుష్కర ఘాట్‌లో పోలీసుల ప్రతాపం - Sakshi

గుంటూరు: అమరావతి పుష్కర ఘాట్‌లో మంగళవారం పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా చిరువ్యాపారులు పెట్టుకున్న సామాగ్రిని పోలీసులు విసిరిపారేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు.

ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్‌ వద్ద పెట్టుకున్న చిరు వ్యాపారుల దుకాణాలను తక్షణమే ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు. వ్యాపారస్తుల సామాగ్రిని దూరంగా విసిరేశారు. దాంతో ఆగ్రహించిన చిరు వ్యాపారులు పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు.

Advertisement
Advertisement