హిందూపురం అర్బన్: హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీ హాస్టల్లో ఎలాంటి వసతులు లేవని, పలు సమస్యలతో సతమౌతున్నా ప్రిన్సిపాల్, అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని కళాశాల విద్యార్థినులు ఏకరువు పెట్టారు. బుధవారం తరగతులను బహిష్కరించి కాలేజీ బయట బైఠాయించి ధర్నా చేపట్టారు. వీరి ఆందోళనకు విద్యార్థిసంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కాలేజీ అడ్మిషన్ సమయంలో అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తామని రూ.వేలు తీసుకోవడమే కాకుండా ప్రతినెల మెస్ బిల్లు రూ.1400 వసూలు చేస్తూ ముద్దఅన్నం, నీళ్లచారు అందిస్తున్నారని వాపోయారు.
అంతేగాక గదులు బూత్బంగ్లాలా ఉన్నాయని, కనీస విద్యుత్ సదుపాయం కూడా లేదని, బాత్రూంలో దుర్వాసన వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగురోజుల క్రితం చెట్టు కింద చదువుకుంటున్న బాలికను గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించి తీవ్రంగా గాయపర్చాడన్నారు. హాస్టల్లో సెక్యూరిటీ లేదని, మ్యాట్రిన్ అసభ్యకరంగా మాట్లాడుతోందని వాపోయారు. వసతులపై ఫిర్యాదు చేస్తే టీసీ ఇచ్చి పంపించేస్తామని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నారని బాధ వ్యక్తం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో విద్యార్థి ఐక్యవేదిక నాయకులు బాబావలి, కదీరిష్, జయచంద్ర, నాగభూషçణం, లోకేష్, వెంకటేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్లో ఉండలేం
Published Wed, Sep 13 2017 10:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement