'కేసీఆర్ స్వార్థం వల్లే ఉప ఎన్నిక' | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ స్వార్థం వల్లే ఉప ఎన్నిక'

Published Sun, Nov 1 2015 6:34 PM

'కేసీఆర్ స్వార్థం వల్లే ఉప ఎన్నిక' - Sakshi

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వార్థపూరిత నిర్ణయంతోనే వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వరంగల్ పట్టణంలో ఆదివారం తెలంగాణ వైస్ఆర్సీసీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి ఎంపికపై, ఎన్నిక వ్యూహాలపై పార్టీ నేతలు చర్చించారు.

వైఎస్ఆర్ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని పొంగులేటి అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లాకు చెందిన పార్టీ నేతలు హాజరయ్యారు.

Advertisement
Advertisement