మున్సిపల్ కు పవర్ కట్ | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కు పవర్ కట్

Published Sat, Jul 16 2016 1:52 AM

మున్సిపల్ కు  పవర్ కట్ - Sakshi

అంధకారంలో కార్యాలయం
పౌర సేవలకు అంతరాయం
జిల్లా కేంద్రంలో దుస్థితి

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం.. రూ.20 వేల బకాయి కూడా చెల్లించలేని ధైన్యం. కార్యాలయానికి ట్రాన్స్ కో అధికారులు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా కార్యాలయంలో సేవలన్నీ నిలిచిపోయాయి. ఆన్‌లైన్, టౌన్ ప్లానింగ్ దరఖాస్తుల అప్‌లోడ్, జనన, మరణ ధృవపత్రాల జారీకి అంతరాయం కలిగింది. జూన్ మాసానికి చెల్లించాల్సిన రూ. 20 వేల బకాయిలను మున్సిపల్ అధికారులు చెల్లించలేకపోయారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది కుర్చీల్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది.

Advertisement
Advertisement