ప్రకాశ్‌నగర్‌లో వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌నగర్‌లో వ్యక్తి ఆత్మహత్య

Published Wed, Oct 19 2016 11:51 PM

Prakasnagarlo individual suicide

కడప అర్బన్‌ : కడప నగరం ప్రకాశ్‌నగర్‌లో నివసిస్తున్న తపిల ప్రసాద్‌ (35) అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు చీరెతో ఉరి వేసుకుని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య నయోమి, బంధువులు తెలిపిన కథనం మేరకు...అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని చింతరాంపల్లెకు చెందిన ప్రసాద్, నయోమిలు బతుకు దెరువు కోసం కడపకు కొన్ని సంవత్సరాల కిందట వచ్చారు. ప్రకాశ్‌నగర్‌లోనే ఓ ఇంటిలో నివసిస్తూ ప్రసాద్‌ పెయింటర్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ప్రభాస్‌ (13), ప్రవీణ్‌ (11), నందు (9) అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు ముగ్గురు సమీపంలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ  నగరంలోని గాంధీనగర్‌ మున్సిపల్‌ హైస్కూలులో చదువుకుంటున్నారు. ఇంటిలో ప్రసాద్, అతని భార్య ప్రస్తుతానికి ఉంటున్నారు. ప్రసాద్‌ మద్యం సేవిస్తూ భార్యను వేధిస్తూ పిల్లలతో కూడా గొడవ పడేవాడు. రెండు రోజుల నుంచి ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరింది.  భర్తతో గొడవ పడటం ఎందుకని బుధవారం నుంచి అతని భార్య బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసాద్‌ ఫ్యాన్‌కు చీరెతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని చిన్నచౌకు పోలీసులు పరిశీలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement