Sakshi News home page

విలేకరిపై దాడి ఘటనలో 'నోటీసులు'

Published Fri, Apr 28 2017 11:57 AM

press council of india issues notice to AP officials

విశాఖపట్నం: నాతవరం సాక్షి విలేకరిపై దాడి ఘటనను ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఏపీ సీఎస్‌, డీజీపీ, విశాక కమిషనర్‌కు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 25న సాక్షి టీవీ విలేకరి ఏడీ బాబుపై లాటరైట్‌ మాఫియా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏడీ బాబు తల, భుజానికి తీవ్రగాయాలు అయ్యాయి. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
 

 

Advertisement
Advertisement