విద్యాశాఖ కార్యాలయ పరిశీలన | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ కార్యాలయ పరిశీలన

Published Sun, Oct 9 2016 10:33 PM

విద్యాశాఖ కార్యాలయ పరిశీలన - Sakshi

హాలియా : మండలాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కార్యాయాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక అవసరాల అధికారి రవినాయక్‌ అన్నారు. ఆదివారం మండలంలోని తిర్మలగిరిలో ఏర్పాటు చేసిన విద్యాశాఖ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. నూతన మండలంలో కార్యకలాపాలు నిబంధనల మేరకే జరుగుతాయని, తాత్కాలిక అధికారులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆయన వెంట అకడమిక్‌ మానటరింగ్‌ అ«ధికారి శ్రీనివాస్‌గౌడ్, మండల విద్యాధికారి తరి రాము తదితరులు ఉన్నారు. 
 

Advertisement
Advertisement