ఏలూరు రూరల్: బాలల హక్కులను పరిరక్షిం చేందుకు ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తానని జిల్లా జడ్జి సునీత అన్నారు. ఏలూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ‘బాలల ఆదరణ, రక్షణ’ అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందన్నారు. బాలల న్యాయ చట్ట ప్రయోజనాలను తెలుసుకుని పొరుగువారికి తెలియజేయాలని సూచించారు. జువెనైల్ జస్టిస్ బోర్డు మెజిస్ట్రేట్ డి.ఉమాదేవి మాట్లాడుతూ పేదరికంలో మగ్గిపోతున్న పిల్లలు చోరీ కేసుల్లో ఇరుక్కుంటున్నారన్నారు. వీరికి విద్య, జీవనోపాధి కల్పించాలి్సన అవసరం ఉందన్నారు. ప్రొహిబిషన్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రీజినల్ ఇన్స్పెక్టర్ నంద గోపాల్ మాట్లాడుతూ పిల్లల్లో నేర ప్రవృత్తిని గుర్తించి సన్మార్గంలో నడిపించాలని లేకపోతే నేరస్తులుగా మారతారన్నారు. చైల్డ్రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్, జిల్లా లీగల్ సెల్ అథారిటీ, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్రైట్స్ ఫోరం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సంస్థ ప్రతినిధులు పి.ఫ్రాన్సిస్, నేతల రమేష్బాబు, యాపిల్ కృష్ణ, నికోలా, మాధవి, వసతి గృహం సూపరింటెండెంట్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
Related news
-
ఎన్నికల శిక్షణకు డుమ్మా.. 70 మంది అధికారులపై చర్యలు!
ఎన్నికల శిక్షణకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం గతంలోనే వెల్లడించించింది. అయితే దీనిని పెడచెవిన పెట్టిన కొందరు అధికారులు చిక్కుల్లో పడ్డారు. ఈ ఉదంతం యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రిసైడింగ్, పోలింగ్ శిక్షణకు హాజరుకాని 70 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. జిల్లా మేజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికల సంఘం నిర్వహించే ఈ శిక్షణ.. ఓటింగ్ ప్రక్రియపై సమగ్ర అవగాహనను కలిగిస్తుంది. అలాగే నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను తెలియజేస్తుంది. ఈ శిక్షణకు హాజరు తప్పనిసరి అని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులకు తెలియజేశారు. ఈ శిక్షణ సమయంలో ఓటింగ్ రోజున తలెత్తే సమస్యల పరిష్కారానికి అనేక వ్యూహాలను తెలియజేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అధికారులకు అవగాహన కల్పిస్తారు. -
మీరా వైఎస్సార్ వారసులు ?..జగన్ స్ట్రాంగ్ కౌంటర్
మీరా వైఎస్సార్ వారసులు ?..జగన్ స్ట్రాంగ్ కౌంటర్ -
చేనేతకు సంక్షేమ అద్దకం
సాక్షి, అమరావతి: పడుగు–పేకల్లా కష్టాలు అల్లుకున్న చేనేత బతుకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆదరణ కోల్పోయిన చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దారు. నేతన్న నేస్తంతోపాటు క్లస్టర్లు, నూలు రాయితీ, రుణాలు, పెన్షన్లు వంటి అనేక రకాల సాయమందించి మగ్గానికి మహర్దశ తెచ్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకపోగా కమిటీలు, అధ్యయనాలు అంటూ కాలయాపన చేశారు. బాబు ఐదేళ్ల హయాంలో రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లుపైగా ఖర్చు చేసింది, నేతన్న నేస్తం సాయం రూ.969.77 కోట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేశారు. సొంత మగ్గం కలిగిన ప్రతి కార్మికునికీ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు అందించారు. దీనికి తోడు కరోనా కష్టకాలంలో 82 వేల చేనేత కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున జమ చేయడంతోపాటు బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందించారు.కరోనా రెండేళ్లు సహా ఐదేళ్లుగా కేటాయించిన ఈ మొత్తం అక్షరాలా రూ.969.77 కోట్లు. ఈ నిధులతో డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో తమ మగ్గాలను ఆధునికీకరించుకున్నారు. 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే ఈ పథకం అమలుతో మూడు రెట్లు పెరిగింది. మరోవైపు అర్హులైన 94,224 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.ఉత్పత్తుల మార్కెటింగ్కు ఊతం చేనేత ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఆప్కో, రాష్ట్ర చేనేత జౌళి శాఖల ద్వారా ఆర్గానిక్ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్ల రూపకల్పన తదితరాల్లో శిక్షణ ఇప్పించింది. 46కి పైగా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడి అందించి మగ్గాలు, షెడ్డులు, ఇతర సామగ్రిని సమకూర్చింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్కార్ట్, లూమ్ఫోక్స్, పేటీఎం, గోకూప్ వంటి ఈ– కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచింది. ఆప్కో షోరూమ్లు విస్తరించింది. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోను ఏపీ చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. జీఎస్టీపై పచ్చ మీడియా గందరగోళం ((బాక్స్)) చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీపై టీడీపీ పచ్చ మీడియా ఇటీవల అర్థంలేని విమర్శలు చేసి గందరగోళం సృష్టిస్తోంది. వాస్తవానికి చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్ను వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్ 43 చెబుతోంది. అయినప్పటికీ నేతకు ఉపయోగించే చిలప నూలుపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం, తయారైన వస్త్రంపై 12 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తోంది. తయారైన వ్రస్తానికి వసూలు చేస్తున్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను చేనేత సహకార సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దాన్ని విరమించుకుంది. మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలని చేనేత సహకార సంఘాలు కోరుతున్నాయి. ఉప్పాడకు వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు చేనేత రంగానికి ఆరి్థక ఊతంతోపాటు అవార్డులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. జమ్దానీ పట్టు నేత కళను కొనసాగిస్తున్న ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఓడీఓపీ)లో రాష్ట్రానికి చెందిన చేనేత రంగం హవా కొనసాగింది. దేశంలో మొత్తం మీద 64 ఉత్పత్తులు దరఖాస్తులు చేస్తే.. వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన 14 ఉత్పత్తుల్లో 8 చేనేతవే కావడం విశేషం. నేతన్న నేస్తం మా జీవితంలో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.1.20 లక్షల ఆరి్థక సాయం అందింది. ఆ డబ్బుతో చేనేత మగ్గాలను ఆధునికీకరించుకొని రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. – శంకర, చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం జగన్కు రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రూ.మూడు లక్షలు సాయం అందించడంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ప్రతి నెల పెన్షన్ వస్తోంది. నా భార్యకు చేయూత పథకం కింద రూ.18,750 నాలుగు సార్లు వచ్చాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.15 వేలు చొప్పున మూడుసార్లు వచ్చాయి. –చింతలపూడి రాంబాబు, చేనేత కార్మికుడు, వాకతిప్ప, కాకినాడ జిల్లా మగ్గాన్ని ఆధునికీకరించుకుని ఆదాయం పొందుతున్నా నేతన్న నేస్తంతో రూ.1.20 లక్షలు ఆరి్థక సాయంతో రావడంతో మగ్గాన్ని ఆధునికీకరించుకున్నాను. ముడిసరుకులు కొనుగోలు చేసుకుని అదనపు ఆదాయం పొందుతున్నాను. నేతన్న నేస్తంతోపాటు ఆసరా ద్వారా రూ.84 వేలు, అమ్మ ఒడి రూ.54 వేలు, సున్నా వడ్డీ రూ.7 వేలు ఆరి్థక సాయం అందడంతోపాటు పిల్లల్ని బాగా చదివించుకుని సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. –పిచ్చుక గంగాధరరావు, పెడన, కృష్ణా జిల్లా మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు రాష్ట్రంలో మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు. చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 25 హామీలు గుప్పించిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేశారు. చేనేత రుణాల మాఫీపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇల్లు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు, ఉచిత విద్యుత్ వంటి హామీలను చంద్రబాబు మరిచారు. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్. బాబు దగా, జగన్ అండబాబు హయాంలో ► ఆప్కోకు రూ.103 కోట్ల బకాయిలు పెట్టారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ► సహకార సంఘాల్లో పనిచేసే కార్మికుల కూలీ నుంచి 8 శాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 8 శాతం చొప్పున మొత్తం 24 శాతం జమ చేసి ఏడాదికి ఒకసారి అందించే త్రిఫ్ట్ ఫండ్ను గత ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నిలిపేశారు. ► 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు, ► చేనేత రుణాలు మాఫీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ చేతులు దులుపుకొన్నారు. జగన్ హయాంలో ► పాత బకాయిలు కలిపి మొత్తం రూ.468.84కోట్లను చెల్లించారు. ► నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్ అమలు చేశారు. సంక్షేమానికి మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు. వీటితో పాటు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, తయారీ–విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు. మేలైన మార్కెటింగ్కు ఈ–కామర్స్ దిగ్గజాలతో ఒప్పందాలు. ► చేనేతకు కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్డీసీ) ఏర్పాటు. ► 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు (పీహెచ్డబ్ల్యూసీఎస్) రూ.250.01కోట్ల సాయం. ► వ్యక్తిగతంగాను, స్వయం సహాక సంఘాల్లోని (ఎస్హెచ్జీ) వారికి నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలు అందజేత. -
కడప కోర్టు ఉత్తర్వుల రద్దు కోరుతూ పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు పెండింగ్లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నర్రెడ్డి సునీత, టీడీపీ నేత రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి) హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తాము తప్పుకుంటామని ధర్మాసనం మౌఖికంగా తెలిపింది. ‘మా వాదన వినలేదు’ కడప జిల్లా కోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, తమ వాదన వినకుండా ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని బీటెక్ రవి, సునీత తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. బాధితులు సూట్ దాఖలు చేయాల్సి ఉండగా.. పార్టీ తరఫున దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదన్నారు. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్నారు. కడప కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కడప కోర్టు తమ వాక్ స్వాతంత్య్రపు హక్కును నిరోధించిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో జిల్లా కోర్టు తుది అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ప్రజాబాహుళ్యంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచేసే హక్కు తమకు ఉందన్నారు. -
అంతా బాబు జట్టే.. పచ్చ కుట్రే..
సాక్షి, అమరావతి: ‘పచ్చ’ ముఠా ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, పవన్ కళ్యాణ్, లోకేశ్, పురందేశ్వరి, బీటెక్ రవి అంతా ఒకే తానులో ముక్కలని తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వారికి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే తప్ప, అసలు హంతకులకు శిక్ష పడటం కాదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. వివేకాను రాజకీయంగా, ఆ తర్వాత భౌతికంగానూ తొలగించుకొన్న వారితో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటకాగుతున్నారన్న విభ్రాంతికర వాస్తవం మరోసారి సాక్ష్కాత్కరించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున, ఈ కేసుపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నందున ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదన్న పులివెందుల న్యాయస్థానం తీర్పును అందరూ శిరసావహిస్తారని భావించారు. కానీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేయడం పచ్చ కుట్రను బయటపెట్టంది. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న వివేకానందరెడ్డిని తానే ఓడించానని చంద్రబాబు నమ్మిన బంటు సీఎం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వివేకాను అంతమొందించే కుట్రకు ఎంత ముందుగా భూమికను సిద్ధం చేశారో అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు చాలా ముందుగానే స్క్రిప్టు సిద్ధం చేశారు. దస్తగిరి, సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల.. ఇలా పలువురు పాత్రధారులు తెరపైకి వస్తూ వారికి ఇచ్చిన డైలాగులు చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత మరింతగా విషం చిమ్మేందుకు తెగించారు. ఓటర్లను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడాలని, సామరస్యపూర్వక రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ భావించింది. పలు న్యాయస్థానాల్లో విచారణ సాగుతున్న ఈ హత్యపై ఎవరూ మాట్లాడటం సరైన విధానం కాదని కూడా అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని విన్నవిస్తూ చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, లోకేశ్, పవన్, పురందేశ్వరి, బీటెక్ రవిని ప్రతివాదులుగా చేరుస్తూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరింది. ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలతో న్యాయస్థానం ఏకీభవించింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడవద్దని ఈ నెల 16న తీర్పునిచ్చింది. మంచి ఉద్దేశంతో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అడ్డగోలు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యమైన చంద్రబాబు అండ్ కోకు మింగుడు పడలేదు. దీంతో పక్కా పన్నాగంతో మొదట సునీతతో ఈ తీర్పుపై అభ్యంతరం తెలిపారు. ఆమె హైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేస్తారని అందరూ భావించారు. కానీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పుపై సునీత వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఈ పిటిషన్లో ప్రస్తావించారు. తద్వారా అంతా చంద్రబాబు తానులో ముక్కలేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కొనే సత్తా లేక కుట్ర రాజకీయాలు చేస్తున్నానని చంద్రబాబు మరోసారి పరోక్షంగా చెప్పారు. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రచారంలోకి తీసుకువచ్చిన కట్టుకథను ప్రజలు ఆ ఎన్నికల్లో తిప్పికొట్టారు. ఎన్నికల తరువాత చంద్రబాబు రూటు మార్చారు. తాము చేసిన నిరాధార ఆరోపణలనే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులతో చెప్పించే సరికొత్త డ్రామాకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతతో మూడేళ్లకుపైగా డ్రామా నడిపించారు. ఆ తరువాత బాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిలను రాష్ట్ర రాజకీయ తెరపైకి తెచ్చారు. సునీత చేస్తున్న నిరాధార ఆరోపణలనే షర్మిల కూడా వినిపిస్తున్నారు. ఇటీవల వివేకా సతీమణి సౌభాగ్యమ్మనూ తెరపైకి తెచ్చారు. వివేకా వర్ధంతి కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, సునీత, షర్మిలతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వారందరి ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. తాజాగా పులివెందుల కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సునీత, బీటెక్ రవి ఒకేలా చంద్రబాబు పాటనే పాడారు. వివేకా శత్రువులు, హంతకులతోనే జట్టు కట్టిన సునీత దంపతులు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదంగా, సందేహాస్పదంగా ఉంది. వివేకాను 2017లో రాజకీయంగా వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీగా ఓడించిన బీటెక్ రవి తదితరులతో వారు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయినప్పటికీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి బీటెక్ రవిని గెలిపించారు. వివేకాను కుట్రతో ఓడించిన ఇదే బ్యాచ్తో సౌభాగ్యమ్మ, సునీత దంపతులు నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉండటం వివాదాస్పదంగా మారింది. సునీత ఇటీవల మీడియా సమావేశంలోనూ చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, మహాసేన రాజేశ్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. మరోవైపు వివేకాను కిరాతకంగా నరికి హత్య చేశానన్న దస్తగిరితోనూ సఖ్యతతో ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. హత్య జరిగిన రోజునా సందేహాస్పదంగా.. వైఎస్ వివేకా హత్య అనంతరం ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019 మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి లేఖ, సెల్ఫోన్ను పోలీసులకు ఇచ్చారు. లేఖను వారు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం.
Related News by category
-
ఉప్పొంగిన జనగోదావరి
మేమంతా.. మీ వెంటే.. తేతలిలో అభిమానుల సందడిరావులపాలెం.. జన సంద్రం.. రావులపాలెంలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న సీఎం జగన్●సాక్షి, భీమవరం: జననేత జనాదరణ ముందు మండు వేసవి చిన్నబోయింది.. ఓ వైపు నిప్పుల కొలిమిని తలపిస్తూ ప్రచండ భానుడి ప్రతాపం.. మరోవైపు వేడిసెగలు కక్కుతున్న జాతీయ రహదారి.. సంక్షేమ సారథిని చూసేందుకు పోటెత్తిన జనాభిమానం ముందు ఇవన్నీ వెలవెలబోయాయి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో జన గోదారిని తలపిస్తూ దిగ్విజయంగా ముగిసింది. ఒకరోజు విరామం తర్వాత శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బుధవారం విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. తణుకు మండలం తేతలి వద్ద రాత్రి బస క్యాంపు నుంచి గురువారం ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. అప్పటికే వేడిగాలులతో సూర్యప్రతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా సీఎం జగన్ను చూ సేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, అభిమానులు క్యాంపు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. సీఎం జగన్ వారందరినీ చూసి బస్సు ఆపి బయటకు వచ్చి అభివాదం చేస్తూ, పలకరిస్తూ ఉత్సాహం నింపారు. ‘ప్లీజ్ హెల్ప్’ అంటూ ప్లకార్డులతో ఉన్న మహిళలను చూసి.. వారితో మాట్లాడారు. తేతలి సెంటర్, తణు కు వై.జంక్షన్, శర్మిష్ట్ట జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, పెరవలి వై.జంక్షన్ మీదుగా బస్సు యాత్ర సా గింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు ఆయా కూడళ్ల వద్దకు చేరుకుని జననేత రా క కోసం ఎదురుచూశారు. బస్సులోని సీఎం జగన్ ను చూసి జై జగన్, సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి సైతం జనం ఉన్న ప్రతిచోటా బస్సు ఆపి బయటకు వచ్చి వారితో మాట్లాడారు. అలాగే వారి వినతులపై తక్షణమే స్పందిస్తూ, చిరునవ్వుతో అభివాదం చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. సత్వరమే స్పందించి.. పక్షవాతంతో బాధపడుతున్న తన 12 ఏళ్ల చిన్నారికి పింఛన్ ఇప్పించాలని వడ్డూరుకు చెందిన తల్లి కో రగా, తేతలిలో జన్యుపరమైన సమస్యలతో బాధడుతున్న నరసింహ అనే దివ్యాంగునికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల పింఛన్ రూ.5 వేలు చేయాలని అతని కుటుంబ సభ్యులు సీఎం జగన్ను కోరారు. ఆయా వినతులపై వెంటనే స్పందించిన ముఖ్య మంత్రి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సిద్ధాంతం.. ఘన స్వాగతం గోదావరి వశిష్ట వారధి (సిద్దాంతం బ్రిడ్జి) సమీపంలో ఆచంట నియోజకవర్గం దొంగరావిపాలెం వద్ద ఎమ్మెల్యే, ఆచంట అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో బస్సుయాత్రకు ప్రజలు ఘ నంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ బయటకు వచ్చి వారిని పలకరించారు. దొడ్డివారిపాలెంకు చెందిన రవికుమార్ రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి ఇబ్బంది పడుతున్నానని, సిద్ధాంతానికి చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి వేండ్ర మోహనరావు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పెనుగొండకు చెందిన విద్యార్థి మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్ ట్రై స్కూటీ, జగనన్న విద్యాదీవెన కోసం అభ్యర్థించగా ఆయా వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తన సిబ్బందికి సూచించారు. అనంతరం వశిష్ట వారధి దాటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి యాత్ర ప్రవేశించడంతో పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర దిగ్విజయంగా ముగిసింది. బస్సు యాత్రలో మంత్రి, తణుకు అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల సీఎం జగన్ పక్కన ఉన్నారు. అదృష్టంగా భావిస్తున్నా.. సీఎం జగన్ను స్వయంగా కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నా సమస్యను సావధానంగా విని సత్వర పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. నాకు ట్రైస్కూటీ మంజూరు చేయమని, జగనన్న విద్యాదీవెన ఆఖరి విడత నిలిచిపోయిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. – మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్, పెనుగొండ సావధానంగా విన్నారు కొబ్బరి బొండాల వ్యాపారంలో తీవ్రంగా నష్ట పోయానని, ఆర్థికంగా చితికి పోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నానని సీఎం జగన్కు విన్నవించుకున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా.. ఆయన నా సమస్యను సావధానంగా విని భరోసా ఇచ్చారు. – వేండ్ర మోహనరావు, సిద్ధాంతం అడుగడుగునా అమితాదరణ సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన జాతీయ రహదారిపైకి పోటెత్తిన జనం జై జగన్ నినాదాలతో మార్మోగిన హైవే ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర -
బస్సు యాత్ర విజయవంతం
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ విజయవంతమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం తణుకులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భీమవరంలో సిద్ధం సభ జనసంద్రమైందని, బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అ వ్వాతాతలు, యువత, చిన్నారులు, మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి సీఎం జగన్కు అభివాదాలు చేసిన దృశ్యాలు కనిపించాయన్నారు. రాజకీయంగా ఇంతటి ప్రజాదరణ పొందిన సీఎం జగన్ చరిత్రలో నిలుస్తారన్నారు. బస్సుయాత్ర, సిద్ధం సభలతో వెన్నులో వణుకు పుడుతున్న చంద్రబాబు అండ్కో దాడులకు దిగుతున్న పరిస్థితుల్లో సైతం జగన్ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వస్తున్నారన్నారు. బస్సుయాత్రను జయప్రదం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు మంత్రి కారుమూరి కృతజ్ఞతలు చెప్పారు. యాత్ర సాగిందిలా.. పశ్చిమగోదావరి జిల్లా తేతల్లిలో రాత్రి బస క్యాంపు నుంచి సీఎం జగన్ తణుకు, సిద్దాంతంమీదుగా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం, ఈతకోట, రావులపాలెం, జొ న్నాడ జంక్షన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మూలస్థానం క్రాస్, చెముడులంక, మడికి జంక్షన్, పొట్టిలంకకు చేరుకున్నాక బస్సు యాత్ర భోజన విరామానికి కొద్దిసేపు ఆగింది. సా యంత్రం వేమగిరి జంక్షన్, ధవళేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియా, బొమ్మూరు సెంటర్ రాజ మండ్రి సిటీ ముఖద్వారం మోరంపూడి జంక్షన్ కు సాయంత్రం 5.34 గంటలకు సీఎం జగన్ చే రుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి నగరంలోకి యాత్ర ప్రవేశించింది. మోరంపూడి జంక్షన్ నుంచి తాడితోట, షెల్టన్ సెంటర్, దేవీచౌక్, పేపరు మిల్లు, కాతేరు గామన్ బ్రిడ్జి, ది వాన్చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రా జాపురంలో రాత్రి బస క్యాంపునకు చేరారు. -
ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
భీమవరం: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో కే శ్రీనివాసులురాజు తెలిపారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధి నేరుగా గాని ప్రతిపాదనతోగానీ నేటి నుంచి 25వ తేదీ గురువారం వరకు నామినేషన్లు దాఖలు చేయకోవచ్చునని అన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కాకుండా ఏరోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు భీమవరం మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్కు గానీ నామినేషన్లు అందించవచ్చన్నారు. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల పత్రాలను పొందవచ్చునని, ఈనెల 26న ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఏదైనా అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరణ సందర్భంలో ఫారం–5 ద్వారా అభ్యర్ధి రాత పూర్వకంగా ఉపసంహరించుకోవచ్చునని, అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ ఆర్డీవో శ్రీనివాసులు రాజు -
నామినేషన్లకు పటిష్ట బందోబస్తు
భీమవరం: ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ డాక్టర్ అజిత తెలిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు పాటించాల్సిన ఎన్నికల నియమావళికి సంబంధించి గురువారం ఆమె ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానానికి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు, సానుభూతిపరులు ఎన్నికల సంఘం విధివిధానాలను తప్పక పాటించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు పొందాలని, సమయం, వారు ప్రయాణించే మార్గాం వివరాలు ముందుగా తెలియజేయాలని సూచించారు. ఊరేగింపులో పది వాహనాలకు మించి ఉండరాదని, డీజేలు, మందు గుండు సామగ్రిని ఉపయోగించాదన్నారు. అభ్యర్థుల ప్రసంగాల్లో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం పరిధిలో 100 మీటర్ల లోపులో అభ్యర్థికి చెందిన మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. గుడాల గోపికి రిటైర్డ్ ఎస్పీ మూర్తి మద్దతు పోడూరు: పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్ధి గుడాల గోపికి పెనుమదం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ జీవీఎస్ మూర్తి మద్దతు తెలియజేశారు. పెనుమదంలో గురువారం వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో స్ధిరపడిన రిటైర్డ్ ఎస్పీ మూర్తి ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపికి తన మద్దతు తెలిపారు. ఆత్మీ య సమావేశం సందర్భంగా ఆయన మండల కన్వీనర్ పితాని చిన్నా, గ్రామక కమిటీ అధ్యక్షుడు గెద్దాడ ఏసులతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా అన్నివర్గాలకు సమన్యాయంతో పరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు తన సంఘీభావం తెలుపుతూ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపికి, ఎంపీ అభ్యర్ధి గూడూరి ఉమాబాలకు తన మద్దతు తెలియజేస్తున్నట్లు మూర్తి స్థానిక నాయకులతో మాట్లాడుతూ చెప్పారు. మూర్తి మద్దతుతో మరింత ఉత్సాహంతో ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపి, ఎంపీ అభ్యర్ధి గూడూరి ఉమాబాల విజయానికి మరింత ఉత్సాహంగా కృషి చేస్తామని పెనుమదం వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన కూటమి నేతలు
తాడేపల్లిగూడెం అర్బన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీలోకి కూటమి నేతలు వలసలు కొనసాగుతున్నాయి. గురువారం పలు చోట్ల టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన గమిని సుబ్బారావు గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గమినిని మంత్రి కొట్టు వైఎస్సార్ సీపీ కండువా వేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ వైస్ చైర్యన్, వ్యాపారవేత్త గమిని సుబ్బారావు వైఎస్సార్ సీపీలో చేరడం శుభసూచకమన్నారు. ఆర్యవైశ్యులు ప్రశాతంగా వ్యాపారాలు చేసుకోవాలి, అందరితోను స్నేహంగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వెళతారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారన్నారు. ఇది చూసిన కూటమి నేతలు అయోమయంలో ఉన్నారన్నారు. గమని సుబ్బారావు మాట్లాడుతూ వైఎస్సార్సిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై జగన్ సమక్షంలో పార్టీలో చేరానన్నారు. ప్రజల భవిష్యత్తు జగన్మోహనరెడ్డి అని సుబ్బారావు అన్నారు. అప్సడా వైస్ ఛైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ గమని సుబ్బారావు వంటి వ్యక్తులు వైఎస్సార్సిపిలోకి చేరడం సంతోషకరమన్నారు. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. పాలకొల్లులో.. పాలకొల్లు సెంట్రల్: సీఎం వైఎస్ జగన్ పాలన మెచ్చే ఇతర పార్టీల నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని వైఎస్సార్ సీపీ పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గూడాల గోపి అన్నారు. పాలకొల్లులో గురువారం 18వ వార్డు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 25 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికి గుడాల గోపి వైఎస్సార్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డు ఇన్చార్జి రామాంజుల పెద్దమదు, ఖండవల్లి వాసుల సమక్షంలో పసుపులేటి రమేష్, పసుపులేటి సుధ, పసుపులేటి జాన్,కొండేటి హనోక్, పసుపులేటి దివ్య, పసుపులేటి రాజేష్, కౌంజు మరేష్, కొల్లి పాప, బెజవాడ లక్ష్మీ, కంకిపాటి శ్రీదర్, వడ్లపాటి పల్లంరాజు, తెన్నేటి రాజేష్బాబు, తానేటి బ్రూస్రామ్, కానూరి రమణ, అనపర్తి రవిబాబుల కుటుంబ సభ్యులు వైఎస్సార్ పార్టీలో చేరారు. సంచారజాతుల కార్పోరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, యడ్ల తాతాజీ, గుమ్మాపు వరప్రసాద్, పాలపర్తి కృపానాథ్, సనమండ సురేష్, పసుపులేటి వీరాస్వామి, రామాంజు చిన్నమధు, కె.జక్కరయ్య, ఎం.జయరావు పాల్గొన్నారు. గుండుగొలనులో.. భీమడోలు: గుండుగొలనుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ భీమడోలు మండల ఇన్చార్జి పుప్పాల కార్తీక్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తమను ఎంతగానో ఆకర్షించాయని, అందుకే టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నామని వారంతా ప్రకటించారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గ్రామాన్ని అభివృద్ధి చేశారని, సొంతింటి కలను సాకారం చేశారన్నారు. అనంతరం పుప్పాల కార్తీక్ సమక్షంలో టీడీపీకి చెందిన వెలగల కృష్ణ, పి.సతీష్, పి.ప్రసాద్, రెడ్డి ప్రసాద్, విశాఖ పవన్, విశాఖ రంగ, గోంగాడ శివ, గుమ్మడి దుర్గారావు, ఆళ్ల దుర్గారావు, ఆళ్ల హేమంత్ తదితరులకు పార్టీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్లను గెలిపించేందుకు యుద్ద సైనికుల్లా పని చేయాలని కార్తీక్ వారిని కోరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు ముదుండి సూర్యనారాయణరాజు, నాయకులు జహీర్, పసుపులేటి శ్రీను, వార్డు సభ్యుడు గొటికల మురళీ, నాయకులు నల్ల శ్రీను, మర్రాపు బాబు, వగ్వాల రామన్ పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
మీరెన్నయినా చెప్పండీ! కొన్ని ఫేక్ న్యూస్తో వచ్చే కిక్కే వేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
Advertisement