మహానేత విగ్రహం తొలగింపుపై నిరసనలు | Sakshi
Sakshi News home page

మహానేత విగ్రహం తొలగింపుపై నిరసనలు

Published Sun, Jul 31 2016 12:02 PM

protest against ysr statue removal

విజయవాడ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై విజయవాడలో నిరసనలు వెల్లువెత్తాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బందర్ రోడ్డు వరకు  ఆదివారం వైఎస్ఆర్ సీపీ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ బరితెగింపు చర్యలపై నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్ సీపీ నేతలు మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, ఉప్పులేటి కల్పన, పార్థసారథి, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, జోగి రమేష్, నాగేశ్వర్ రావు, భవకుమార్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement