పులివెందుల విద్యార్థి అనంతలో ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పులివెందుల విద్యార్థి అనంతలో ఆత్మహత్య

Published Sun, Dec 25 2016 10:59 PM

పులివెందుల విద్యార్థి అనంతలో ఆత్మహత్య - Sakshi

ముదిగుబ్బ: వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని శారదా ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే అశోక్‌(15) రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు అనంతపురం జిల్లా ముదిగుబ్బ రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ మహదేవ తెలిపారు. ముదిగుబ్బ మండలం సంకేపల్లికి చెందిన శ్రీనివాసులు కుమారుడు అశోక్‌ క్రిస్మస్‌ సెలవులకని స్వగ్రామానికి వచ్చాడన్నారు. తరచూ అనారోగ్యంతో బాధపడేవాడని, దీంతో జీవితంపై విరక్తితో రైలు కింద పడి తనువు చాలించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement