కోండ మీద కొండచిలువ | Sakshi
Sakshi News home page

కోండ మీద కొండచిలువ

Published Sun, Dec 6 2015 11:15 PM

python in tirumala

తిరుమల: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర అతిథి గృహం. ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటలకు.. గెస్ట్ హౌస్ నుంచి జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. వామ్మో.. పే..ద్ద.. పాము.. అంటూ కేకలు పెట్టారు. అంతలోనే బాలాజీనగర్ నివాసి మునస్వామి అక్కడికి చేరుకుని ఆ భయంకర రూపాన్ని పట్టుకున్నాడు.

 

చూస్తే.. అది 15 అడుగుల పొడవున్న బారీ కొండచిలువ. పక్కనున్న అడవి నుంచి పొరపాటున అతిథిగృహం వైపునకు వచ్చిన కొండచిలువను అధికారులు తిరిగి అడవిలో వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం తిరుమలలో మరో నాగుపామును కూడా పట్టుకున్నారు.

Advertisement
Advertisement