మార్క్సిజం.. అంబేడ్కరిజం మిళితం కావాలి | Sakshi
Sakshi News home page

మార్క్సిజం.. అంబేడ్కరిజం మిళితం కావాలి

Published Fri, Apr 15 2016 12:21 PM

మార్క్సిజం.. అంబేడ్కరిజం మిళితం కావాలి - Sakshi

ఆర్.నారాయణమూర్తి
 
మార్క్సిజం, అంబేడ్కరిజం మిళితం అయితే  దేశం బాగుపడుతుందని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు.  గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు.

ప్రశ్న: అంబేడ్కరిజమ్‌ను.. మార్క్సిజమ్ బలపరుస్తాందా?
సమాధానం: కారల్‌మార్క్స్ వర్గసమాజం గురించి చెప్పారు. అంబేడ్కర్ కులవర్గ రహిత సమాజం గురించి తెలిపారు. విభిన్న జాతులతో కూడుకున్న భారతదేశంలో రెండూ ఏకమవ్వాలి.


ప్ర: దేశం బాగుపడాలంటే ఏమి చేయాలి?
స: కులం లేని  దేశం ఉండాలి.


 ప్ర: ప్రస్తుత యూనివర్సిటీల పరిస్థితిపై మీ సమాధానం?
 స: కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు రాజకీయపార్టీల అనుబంధం ఎక్కువైంది. అందుకే పార్టీలు ఓటు బ్యాంకు వ్యాపారం చేస్తున్నాయి.


 ప్ర: ర్యాగింగ్‌పై మీ అభిప్రాయం?
 స: కళాశాలలో ర్యాగింగ్,కుల, మత, మానసిక ఒత్తిడులు ఉండకూడదు. రోహిత్, రిషితేశ్వరి వంటి ఘటనలు మళ్లీ జరగకూడదు.

Advertisement
Advertisement