టీడీపీ, బీజేపీల గుర్తింపును రద్దు చేయాలి | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీల గుర్తింపును రద్దు చేయాలి

Published Sun, Jul 10 2016 1:58 AM

Raghuveera reddy fires on TDP,BJP

ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్

 విజయవాడ సెంట్రల్ :
ఎన్నికల హామీలను అమలు చేయని టీడీపీ, బీజేపీల గుర్తింపును రద్దు చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. త్వరలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం శనివారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్‌లో జరిగింది.

సమావేశంలో చేసిన పలు తీర్మానాలను రఘువీరారెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఎన్నికల హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్ కూడా ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా హామీల అమల్లో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

Advertisement
Advertisement