విశాఖ కలెక్టరేట్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్ష | Sakshi
Sakshi News home page

విశాఖ కలెక్టరేట్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్ష

Published Thu, Feb 18 2016 7:59 PM

Rajnadh singh to meet review on maoists contol

విశాఖ: విశాఖ కలెక్టరేట్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఏవోబీలో మావోయిస్టుల నియంత్రణ, ఏజెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వారిలో ఆంధ్రపద్రశ్‌ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర హోం శాఖ కార్యద్శి, కేంద్ర ఇంటెలిజెన్స్‌, గ్రే హౌండ్స్‌, జీఆర్‌పీఎఫ్‌, టీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement