రంజాన్ ప్రత్యేకం
స్టేషన్ మహబూబ్నగర్: అరబ్ దేశపు చాయ్ ‘ఘావా’కు రంజాన్ మాసంలో భలే డిమాండ్ ఉంటోంది. మహబూబ్నగర్తో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వీటిని ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఘావా అంటే అరబ్ భాషలో వివిధ ఔషధాల మిశ్రమం అని అర్థం. వెయ్యేళ్లకు పూర్వం అరబ్ దేశం యెమన్లో షాజిలీ, ఖామిరి అనే ఇద్దరు ధర్మపండితులు రాత్రిపూట దైవనామస్మరణ (జాగరణ)లో గడపడానికి ఈ వేడి పానీయాన్ని తయారు చేసి వాడడం మొదలుపెట్టారు. దీనికి ‘ఘావా’ అని పేరు పెట్టారని చెబుతారు.
ఆరోనిజాం మీర్ మహబూబ్ అలీ కాలంలో ప్రభుత్వ మిలట్రీ కోసం యెమన్ నుంచి అరబ్లను ఇక్కడికి తీసుకొచ్చి వారికి రక్షణ సంబంధిత బాధ్యతలను అప్పగించారు. వీరి ద్వారా హైదరాబాద్లో ఘావా ప్రారంభమైందని చెబుతారు.
ఘావా తయారీ ఇలా...
కాఫీ పొడి, సొంటి, ఎండు అల్లం, దాల్చిన చెక్క, జాఫ్రాన్, యాలకులను నూరి పౌడర్లా తయారుచేస్తారు. దీనిని వేడినీటిలో నింపడంతో ఘావా తయారవుతుంది. ప్రస్తుతం ఘావా, బెల్లం ఘావా, పాల ఘావా, లెమన్ ఘావాలనే మూడు రకాలలో లభ్యమవుతోంది. అరబ్లు ఉన్నచోట ఘావా తప్పక ఉంటుంది. వారి దినచర్యలో దీనికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. రంజాన్మాసంలో ఘావా ఎక్కువగా ఉంటోంది.
ఇవీ ప్రయోజనాలు..
ఘావా తాగడం ద్వారా జీర్ణశక్తి పెరగడంతో పాటు మలబద్దకం దూరమవుతుంది. జలుబు తగ్గుతుంది, పరగడుపున ఘావా తాగడం ద్వారా ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో రంజాన్ ఉపవాసాలను ఇఫ్తారు దీక్షను ఘావా, ఖర్జూరంతో విడవడం ఆనవాయితీగా వస్తోంది.
మార్కెట్లో...
జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్, మదీనా మజీద్ రోడ్, వన్టౌన్ పోలీస్స్టేషన్, న్యూటౌన్ తదితర ప్రాంతాల్లో ఘావా దుకాణాలు వెలిశాయి. యువకులు, మహిళలు, వృద్ధులు ఘావా తాగేందుకు ఇష్టపడుతారు. పాల ఘావాకు మంచి ఆదరణ ఉంది. అన్ని వయస్సుల వారు దీనిని వాడుతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు కూడా ఆయా స్టాళ్లలో ఘావాను విక్రయిస్తున్నారు.
మోతీ మజీదు
జిల్లాకేంద్రం బోయపల్లిగేట్ సమీపంలో మోతీ మసీదు కు 90ఏళ్ల చరిత్ర ఉందని స్థానిక మత పెద్దలు చెబుతున్నారు. ఈ మసీదు నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకేసారి మసీదులో వెయ్యిమంది నమాజ్ చేయవచ్చు.
- స్టేషన్ మహబూబ్నగర్
రంజాన్ స్పెషల్ చాయ్ ఘావా
Published Wed, Jun 22 2016 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement